పుట:Srinadhakavi-Jeevithamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

శ్రీనాథకవి


“కృతిపతి యొక్క తమ్ముడైన తిరుమలచెట్టిని వర్ణించుచు కవి యిట్లు వ్రాసియిన్నాడు:—

చ. హరిహరరాయ 4-సు బాస్.. నానిని భూ..........
వరులు నిజప్రభావను నూ వగైన సేయఁగు ముం సర్వధీ
శ్వరుని వత త వైభవము స్వమి నొక్కడ నిర్వహించు మా -
మాతిరుమల నాథ సెట్టిని దట్టి నెవ్వతడతిన్.

ఈపద్యమునందు ముగ్గురు సమకాలిక లైన రాజుల పేళ్లు చెప్పఁబడి యున్నవి. వీరిలో హహరరాయలు విజయనగరాధీశ్వ రుఁడు. 1377 మొదలు 1426 వఱకు రాజ్యము చేసెను. ఫీరోజుషహా బహమనీ రాజు.1367 మొదలు - 1426 వఱకు - రాజ్యము చేసెను కుమారగిరి కొండవీటి రాజు. ఈతడు శ్రీ జయంతి రామయ్యగారి మతమున 1378 మొదలు 1398 వఱకు రాజ్యము చేసెను. శ్రీ చిలు కూరి వీరభదరావుగారి మతమున 1383 మొదలు 1400 వఱకు రాజ్య ము చేసెను. ఈముగ్గురు రాజులును బ్రతికి యుండి స్వస్వరాజ్యము. లను పాలించుచుండిన కాలము శ్రీ జయంతి రామయ్యగారి యభిప్రాయము ప్రకారము 1377 - 1398 రెండు సంవత్సరములు. శ్రీ వీరభద్రరావు గారి యభి ప్రాయము ప్రకారము 1347 -1461. నాలుగు సంవత్సరములు. ఇట్లు హరవిలాసనిర్మాణ కాలము మనము ఒకటి రెండు సంవత్సరముల యంతరముతో సరిగఁ గనుగొనఁ గలిగితిమి 1450 .వ సంవత్సర ప్రాంత మున ననఁగా 1368లోనో 1369 లోనో కుమా రిగిరి ప్రభుత్వపు చివర భాగమున, ఈ కావ్యము వ్రాయఁబడినదని స్పష్ట పడుచున్నది.దీనిని బట్టి ఇతర కావ్యముల యొక్క కాలనిర్ణయమును చేయవచ్చును" అని వ్రాసి హరవిలాస కాలమును నిర్ణయము " గా వించిగరి.

ఈ కాలమునే వీరేశలింగము గారును . అంగీకరించిరి. విరేశలింగ ముగారి యభిప్రాయము ప్రకారము శ్రీనాథుఁ డిప్పటికీ ముప్పదియైదు సంవత్సరముల ప్రాయము వాఁడు. లక్ష్మణ రావుగారి యభిప్రాయము