పుట:Srinadhakavi-Jeevithamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీమద్యాయము

31


కె యుక్తి యుక్తముగ వాదించి శ్రీనాథుని జన్మకాలము నిర్ణయింపగలిగినను, వీరేశలింగము గారు వివాస్పదములయిన విషయముల నన్నిటిని నెత్తికొని యెట్టిపరీత సిద్ధాంతములను తాము చేయుచున్నారో తెలికొనఁ జాలక, తాము చెప్పిన కాలమును సమన్వయించుకోలేక చరిత్ర కాలములను విస్మరించి గాథలనే ప్రధానముఁ జేసికొని, కేవలము లక్ష్మణ రావు గారి కాలనిర్ణయము పై నే యాధానపడి వారి భావమునే తమ గంథము లోనికిఁ జొప్పించియు వారి నామమునైన సుదాహరింపక వారివాసము నకును దమవాదమునకును గొంచెము భేదము కలదని చదువరులను కొనుటకై యవక తవక మార్పులను గావించి పరిహాసాస్పద మగునట్టి వాడమును నెలకొల్పిరి. లక్ష్మణ రావు గారు శ్రీనాథుని కాలనిర్ణయము నిట్లు గావించిరి.

1360 శ్రీనాథుని జన్మ కాలము
1336. మరుద్రాట్చరిత్ర రచనా కాలము
1385 శాలివాహన సప్తశతి కాలము
1395 ఆంధ్ర నైషధ కాలము
1400.హరవిలాసకాలము
1410. ఫిరంగిపుర శాసనకాలము
1413 అల పాడు తామ్రశాసన కాలము
1426 అమీనా బాదుశాసన కాలము
1420 భీమఖండకాలము
1430 కాశీఖండ కాలము
1435 శివరాత్రి మహాత్మ్య కాలము ..
1440 మరణ కాలము
శ్రీ వీ రేశలింగముగారు శ్రీనాథుని కాలనిర్ణయము నిట్లు గావించిరి :

1365 శ్రీనాథుని జన్మ కొలము.