పుట:Srinadhakavi-Jeevithamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాధ్యాయము

29


వీరరుద్రాశేషనిశ్వంధరాధీశ
పృగులదక్షిణ భుజా పీఠమనంగ:
యవససంహార విలయ కాలాగ్నియనఁగ
ధాటింఘటిత కుమ్మశోద్యానుఁడనఁగ
విశ్వలోకి ప్రశస్తుండై వినుతికెక్కె
కతులబలశీల పోలయ యన్న శౌరి


అనఁగా ఈతఁడు ప్రతాపరుద్రుని గజఘట సేనల కధ్య క్షుడనియు, నవ లక్షతధనుర్ధరులుగల రాజ్యాధిపతి సేనాసముద్రముసకుఁ జంద్రునివంటి వాఁడనియు, ఆంధ్రభూమండలాధ్యక్షు సింహాసన ప్రతిష్టాపకుండనియు, వీరరుద్రమహా రాజు యొక్క సమస్త రాజ్య భారధురంధరుఁడనియు, యవ నుల సంహరించుటలోఁ గానాగ్ని రుద్రకల్పుఁడనియు, కుమ్మరమను ప్రదేశమును జయించెననియు, శ్రీ నాథకవి వర్ణించి యున్నాడు. ఆపులా రణమునందే తన తాతయగు క్షమలనాభామాత్యుఁడు కవితా విద్యాధు రంధరుండనియు, పద్మపురాణసంగ్రహ కళాకావ్య ప్రబంధాధిపుడని యును, సముద్ర తీరమునందలి కాల్పట్ల గాధీశ్వరుఁడుగా నుండెననియు వర్ణించిన పద్యము నీయధ్యాయము మొదట నిదివఱకే యుదాహ రించి యున్న వాఁడను. ఇందువలన భీమేశ్వరపురాణ కృతిభర్త యొ క్కయు, కృతికర్త యొక్కయు బితామహు లిర్వురును రెండవప్రతాప రుదుని కాలమున రాజకీ యోద్యోగులుగ నుండి సమకాలికులై ప్రసి ద్ధిగాంచినవారుగఁ గనుపట్టుచున్నారు.మఱియుఁ గాశీఖండమున పూర్వకవి స్తుతి వర్ణన సేయుచు


మత్పితామహుఁ గవిపి తామహునిఁ దలఁతు
కవిత కావ్యక ళాలాభుఁ గమలనాభుఁ
చంద్ర చందస నుందార సదృశ కీర్తి,
సరససాహిత్య సామ్రాజ్య చక్రవర్తి.

అని వర్ణించే నే కాని తన తాత తనకు విద్యాగురువునుగాజెప్పుకోనియుండ లేదు. ఇక తన తండ్రియగు మారయామాత్యుని శ్రీనాధకవి కాశీఖండ