పుట:Srinadhakavi-Jeevithamu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

శ్రీనాథకవి



రాజ్య విస్తీర్ణము

వీరభద్రా రెడ్డి కటకాధిపతియు, కళింగ గాంగవంశజుఁడుసు, భాను దేవునిసోడించి తన రాజ్యమును గజపతియు నగు భానుదేవునినోడించి తన రాజ్యమును విస్తరింపఁ జేసెను,ఈ ప్రదేశమంతయఁ గళింగ దేశమని పూర్వము వ్యవహరింపఁబడినను శ్రీనాథకవిసార్వభౌముఁడు వీరభద్ర సృపాలుని మధ్యాంధ్ర క్షమామండలేశ్వరుండనియు వ్యవహరించి యున్నాడు.ఆనాటికే కళిగ దేశము సంపూర్ణముగా నాధ్ర దేశములోని భాగముగా నేర్పడినది. ఈ రెడ్డి రాజుల పలిపాలించిన భూభాగమం తయును ముప్పది వేల మైళ్ల వైశాల్యము గలది యై యుండెననుటకు సందియము లేదు. అల్లాడ రెడ్డి పుత్రులు నిరంకుశులై యవక్ర పరా క్రమంబున నీరువ దేండ్ల కాలము మధ్యాంధ్ర దేశమును బరిపాలించిన వెనుక దేశము ఘోయుద్ధములకు రంగస్థలమైపోయినది.

రెడ్ల ధర్మకార్యములు


అల్లాడి వేమ భూపాలుని శ్రీనాథకవి సార్వభౌముఁడు దేవ బ్రాహ్మణ భక్తి వర్ధిత ధరిత్రీచక్ర సొమాజ్య లక్ష్మీ వాస్తోష్పతి' యని వర్ణించి యుండఁగా నాకని ధర్మకార్యము లెట్టి వై యుండు నోఁ వేఱుగ జెర్చక్క లేదు. ఇతడనేక భూ వానములను కావించి శ్రీగిరి కాశీ పంచారామాది దేవభవనంబులలో శాసనములు వ్రాయించెనని యీ క్రింది పద్యమునలన 'వేద్యము కాఁగలదు.


 “ కం. కాంచీ శ్రీగిరి కాశీ
పంచారామాది దేవభవనంబుల వ్రా
యించెనువేమక్ష్మాపతి
యంచిత భూధాన శాసనాక్షర పజ్జుల్ .,

గీ. ధర్మశాసన ఘన లాస్తంభ మెత్తే
ముకుందోద్భవ స్వామి శివుని మ్రోల
వీరభద్రేశుడా చంద్ర తారకముగ
నగ్రహారాళి నఖిల మాన్యంబు లొసంగి