పుట:Srinadhakavi-Jeevithamu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాయము 7


ఇట్లఖండ కీర్తి వైభవములతో నొప్పొఱుచు శ్రీనాథకవి సార్వభౌముడు క్రీ. శ క 1435 సంవత్స ప్రాంతముల మరల రాజమహేంద్రపురమునకు విచ్చేసెను. ఇతఁడు కర్ణాటాధీశ్వరుడు ప్రౌఢదేవరాయల యాస్థానముననుండు డిం డిమ భట్టారక కవిసార్వభౌముని నోడించి యూతని కంచుఢక్క, బగుల గొట్టించి యాతని కవిసార్వ భౌమ బిరుదము నొపిచికొని కర్ణాట సార్వభౌమునిచేఁ గనకాభి షేక నత్కారమును బొందిన విదమునంతయు నాధ్ర దేశమున బహువిధములఁ గవిపండితకోటి చేఁ బ్రశంసింపఁ బడుటఁ 'దెలిసికొని రాజమహేంద్రపుర పండితులు తను తొంటి వైషమ్య భావములను విడిచి పెట్టి మధిక గౌరవమును జూవ మొదలిడిరి. ఇంతకుముందే అన్నామాత్యుఁడు "మొదలగువారు వేమ వీర భద్రా రెడ్లను శ్రీ నాథకవి సార్వభౌముని ప్రజా ప్రభావములను, ప్రతిభా విశేషములను, ప్రౌఢ సాహిత్య సౌష్టవములను నుగ్డింపుచు నాతనియెడ వారికి విశేష గౌరవ ముదయించునట్లు చేయుచు వచ్చిరి ఇతకుఁ బూర్వము వేమ వీరభద్రా రెడ్లకును శ్రీనాథునకు విశేష పరిచయ మున్నట్లు గాన రాదు.శ్రీనాథుడు రాజమహేంద్ర పురమునకు వచ్చిన వెనుకనో యంతకు బూర్వముననో కాశీఖండమును రచించుటకుఁ బూనుకొనెను. ఈ విషయమును అన్నామాత్యుఁడు వీరభద్రారెడ్డికిఁ జెప్పి యంకితముఁ బొందవలసినదిగా నాతనిఁ బోత్సహించెను. అందుల కాతఁ డియ్యకొ నెను.ఈ సంగతితే శ్రీనాథకవి సార్వభౌముఁడు తాను రచించిన శాశీఖండమునఁ దిట్లు చెప్పుకొని యున్నాడు ,

శ్రీ నాథుఁడు మరలివచ్చిన తరువాత నొకనాఁడు : తనలో దానిట్లు తలపోసి కొనియెనఁట,