228
శ్రీనాథకవి
I- ...
మెతుకు సీమను బరిపాలించుదొరలు రేచర్ల వంశీయులు కారను తలంపుతో ప్రభాకరశాస్త్రి గారు సర్వజ్ఞ సింగమనాయని సందర్శించుటకై యాదేశమునకుఁ బోయిన సమయమునం దే బమ్మెర పోతనవంటివాని నాద రింపనికారణమును బురస్కరించుకొని మెతుకుదొరలను శ్రీనాధకవిసార్వ భౌముఁడు తిట్టినట్టి చాటుపద్యమని యీకింది పద్యమును తమగ్రంథ మునం దుదాహరించియున్నారు.
చ. కుతుకలు కోయనొంగలకు ఘో వికాతురుష్కజాతికిన్,
మతకఫు లుం జెతొత్తులకు, మాదిగ వాండ్రగు మహ్లాదార్లకున్
కొతళక .యిత్తు; nకవికోటులకిత్తున్ :చిత్తు రం తెపో
మొగుడ దొరల్ ..... ...... ...... ..... భయదోర్బలుల్
మఱియు భాగవతమునందు బమ్మెరపోతన,
మ. ఇమ్మను జేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము నాసీ కాలు చే
సమ్మెట వ్రేటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పెనీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్,
.
అని రావువంశీయుల రాజ్యములోనిదగు నేక శిలానగరమున నుండియు నిట్టి పద్యమును వ్రాసి ప్రకటించిన దానిఁ గూడ 'ప్రభారకళాస్త్రి గారెఱుంగుదురు.
ఇందుకు భిన్నముగా రేచర్ల వంశీ యుల ప్రాంత వ్రాతపొత్త ములలో సర్వజ్ఞ సింగభూపాలుఁ డిట్ల భివర్ణింపబడి యున్నాఁడు.
సీ. 'సకల విద్యాభ్యాస సాహస గరీమంబు
నూటిమీఱఁగఁ దోడుసూపినాడు
కఠిన ళాత్రవ యూధమున కందరిక్తంబు
వేడ్కఁగాళికి భుక్తి పెట్టి నాడు
సాధు మార్గశ్రియా సౌజన్యమున నీతి
చెలగ సద్వర్తనల్ చేసి నాఁడు
సంతతార్దివ్రాత సముదయంబులతోడ
వెలయు బాంధవము గావించి నాడు'