శ్రీనాథకవి
మెవ్వ రేవిధముగాఁ జెప్పినను ఒకటి కెండు సంవత్సరముల భేదముతో
సరిపోకమానవనియు, శ్రీమాన్ కీలాంబి రాఘవాచార్యులు ఎమ్. ఏ.
బి. ఎక్. గారు మఱొకమాఱు శద్ధతో బరిశోధించిన యెడ వారు
తెలిసికొనఁగలరని నాదృఢమైన విశ్వాసము. అట్లుచేయఁ బార్థింతును .
వారు చేసిన గొప్పతప్పేమన మొదటి దేవరాయలు, 'రెండవ దేవగా
యలు లేక ప్రౌడ దేవరాయ ల నుటకు మాఱుగా ప్రథమ హరిహర
రాయలు, ద్వితీయ హరిహర రాయులని వ్రాయుటయే. ద్వితీయ హరిహర
రాయలు క్రీ. శ. 1425-1446 సంవత్సరములలో రాజ్య మొనర్చినట్లు
మొదట వ్రాసి తరువాత కిందను 'ద్వితీయ హరిహరరాయ లయినచో
కవి క్రీ. శ.1475 ప్రాంతము వాఁడగునని వ్రాయుట మఱియొక తప్పు.
అళియ రామరాజు ముత్తాతయగు సోమభూపాలునకు శ్రీధరఛందస్సు
అంకితము చేయఁబడినదనుట మఱియొక తప్పు. అళియరామరాజు
ముత్తాత యార్వీటిబుక్క రాజు గాని సోమభూపాలుఁడు గాఁడు.
అళియ రామరాజు వంశము బాలభాగవతము సందును, నరపతి విజయము నందును దెలుపబడినది.
తాత పిన్నమరాజు కొడుకు సోమ దేవరాజు, వానికొడుకు రాఘవరాజు, వానికొడుకు పిన్నమరాజు, వానీకొడుకు బుక్క గాజు;వాని కొడుకురామ రాజు; వానికొడుకు తిమ్మరాజు; వానికొడుకు శ్రీరంగరాజు; వానికొడుకు అళియ రామరాజు.ఇట్లుండఁగా ఆళియ రామరాజు ముత్తాత సోమభూపాలుఁడనుట తప్పు. అళియరామరాజున కేగు తరములకుఁ బూర్వమున్న వాఁడు సోమ దేవ రాజు. ఈ సోమ దేవ గా జే సోమభూపాలుఁ డనుకొంద మన్న' నతఁడు క్రీ. శ. 1320 సంవత్సరమునకుఁ బూర్వుఁడు కాని ' తరువాత యుండఁడు. అతని కంకితము చేయఁబడిన శ్రీధరఛందస్సులో 1450 ప్రాంతమున వ్రాయఁబడిన క్రీడాభిరామములోని మంచనవింటినో?!