పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

471

యుద్ధకాండము

వీసత్య మితరుల - కెల్లఁ గల్గెడును
కపు లెల్లఁ గలుగ మా - కార్యంబు లెల్ల
నిపుడింతె కొఱ లేక - యీడేఱె మిగుల "
అనుచు నందఱును హి - తాలాపములను
మనముల నలరించి - మఱలి తామున్న
పాళెంబుఁ జేరి య - పారకృపావి
శాలమానసుఁడు ల - క్ష్మణుఁజూచి పలికె. 10740

-: విభీషణునికి లంకా రాజ్య పట్టముఁ గట్టుట :--

“ సౌమిత్రి ! యీ విభీ - షణుఁ డొక్కడుండఁ
గామి తార్థము లెల్లఁ - గడతేఱె మనకు
నితని దోకొనిపోయి - యిపుడే లంకకును
ప్రతినఁ దప్పక యుండఁ - బట్టంబుఁ గట్టి
రమ్ము ప్రధాన కా - ర్యంబిది నాకు
తమ్ముఁడు మీలో ని - తండొక్కరుండు”
అన లక్ష్మణుఁడు వాన - రావళిచేతఁ
గనక కుంభముల సా - గరనదీ జలముఁ
దెప్పించి పురము సొ - త్తెంచి యానగరి
గొప్ప సింగపు గద్దె - గూర్చుండఁ జేసి 10750
తానొక్క. కలశాంబు - ధారచే మీఁద
తానంబు సేయించి - తగువారిచేత
మంత్రులచే నాగ - మప్రకారమున
మంత్రపూతంబుల - మజ్జనంబార్చి
పట్టంబుఁ గట్టి యా- ప్తనిశాచరులనుఁ
కట్టు వర్గంబుల - కట్టడలిచ్చి