పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

389

యుద్ధకాండము

అని సుషేణుని బిల్చి - యౌషధక్రియల
మును వానరుల గాయ - ములు నొప్పి మాన్పి
"సౌమిత్రి యంగంబు - చాల నొచ్చినది.
తామసింపక చికి - త్స యొనర్పు మీవు 8870
విచికిత్స మానుమీ - వేళ" యనంగ
నుచితజ్ఞత సుషేణుఁ - డొకయాకుదెచ్చి
సౌమిత్రికిని విభీ - షణ వానరులకు
నామందు పిడిచి న - స్యముఁ జేయుటయును
నందఱు మునుపటి - కన్న నెమ్మేను
లందుఁ జెల్వంది గా - యమ్ములు మాని
కాయముల్ వజ్రని - కాయముల్ గాఁగ
శ్రేయోధి కారులై - శ్రీ రాము చెంత
నెప్పుడు రావణుఁ - డెదిరించు ననుచు
ఱెప్ప వేయక చెల - రేఁగి యున్నంత. 8880

-: ఇంద్రజిత్తు మరణమువిని రావణుఁడు దుఃఖించుట :-

చెడి విఱిగిన హత - శేషులు వఱచి
చిడుముడితో నింద్ర - జిత్తుని పాటు
నావిభీషణుఁడు తో - డై వచ్చి మర్మ
మావల నెఱిఁగించి - యదటణంచుటయు
వినుపింప విబుధారి - విభుఁడొక్కజాము
తన మేనెఱుంగక - తడవు మూర్ఛిల్లి
మిత్రులు బోధింప - మెల్లనే తెలిసి
పుత్రశోకంబునఁ - బొరలుచుఁ బలికె