పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

252

శ్రీ రా మా య ణ ము

విచ్చి పాఱెడువారు - వెతనొందువారు
రాముని మఱుఁగు చే - రఁగ నేఁగువారు
సౌమిత్రి చాటుకుఁ - జనియెడువారు
నగుచుండ రఘువీరుఁ - డమ్ములు విల్లు
తెగువతో సవరించి - దిటవూని నిలిచి 5660
సడ్డచేయని విభీ - షణుఁ జూచి దిగులు
పడ్డవానరులఁ దే - ర్పగ నిట్టులనియె.
"ఇదియేమి మిన్నెల్ల - నేకమై దిశలు
బొదువుక యొక మహా - భూతంబు నడచె ?
ఆదిఁ ద్రివిక్రముఁ - డైన వామనుని
కీదేహ ముద్దియై - యీడు రాఁబోలు
విబుధాచలము బోయె - వింధ్యపర్వతము
సొబగిట్టులుండునో - చూడుము నాఁడు
నీ మహాభూత మూ- హింపఁగ విలయ
భీముఁడో యముఁడో రూ - పింపు"మిట్లనుచు 5670
నని పల్కు- జానకీ - ప్రాణేశుఁ జూచి
దనుజనాయకుని సో - దరుఁడిట్లు వలికె.

-: శ్రీరామునికోర్కె ననుసరించి, విభీషణుఁడు కుంభకర్ణుని పుట్టు పూర్వోత్తరము లెఱింగించుట:-

"అయ్య ! యీతఁడు రావ - ణానుజుఁడెచ్చు
కయ్యముల్ గెలిచి చే - కన్నట్టివాఁడు,
అమరేంద్రు నోడించి - యనలుని గెలిచి
శమనుఁ బోఁదఱిమి రా - క్షసనాథుఁ దోలి
వరుణుఁ గీటడఁగించి - వాయువుఁ దూల్చి