పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

శ్రీ రా మా య ణ ము

అని చెలికాని నూ - రార్చి సుషేణు
గనుఁగొని యా రుమా - కాంతుఁ డిట్లనియె.

-: సుగ్రీవుఁడు సుషేణునితో రాముని కిష్కింధకుఁ గొనిపొమ్మని చెప్పుట :-

"కలనిలోఁ బడిన రా - ఘవుని గాత్రములు
నలఁగఁగానీక యం - దలములో నుంచి 4430
యెత్తించుకొని యేఁగు - మీవు కిష్కింధ
కిత్తరి కపివీరు - లేనునుఁ గూడి
రావణుఁ జంపియా - రాజ్యాధిపత్య
మావిభీషణునకు - నిచ్చి వచ్చెదను.
పంతమాడిన యట్లు - పలుకు చెల్లింతు
నింత వైదేహినే - నిత్తు రామునకు
బోయలఁ బిలిపించు - పొమ్మ”న్న నతఁడు
చేయియోడ్చి వనాట - శేఖరుఁ బలికె

       -: సుషేణుఁడు చంద్రద్రోణనగమునందలి, విశల్యసంజీవకరణులను
             హనుమంతునిచేఁ దెప్పింపుమని సుగ్రీవునిఁబ్రార్థించుట :-

తొల్లి సురాసురో - ద్ధురసమరముల
బల్లిదులగు దైత్య - పతులచే మడియు 4440
సురలను బతికింప - సురలోక గురుఁడు
వరమతియైన ధ - న్వంతరిచేత
విని మున్ను మధియించు - వేళ నాక్షీర
వనరాశి నౌషధ - వ్రాతంబు వొడమ