పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17

రత్న కుండలములు రాజీవరాగ
నూత్న మంజీరమనోహరాంఘ్రులును
మౌక్తిక మాలికల్ మాణిక్యకవచ
సక్తమై మించు విశాలవక్షంబు
మరకతకేయూర మంజుబాహువులు
నరుణపక్షములు చందాననాబ్దంబు
కురణావలోకముల్ కంబుకంథరము
నరుణపల్లవ కోమలాగ్రహస్తములు
దుందుభిస్వనము లత్తుకచాయమేను
మందరమేరు సమానగోత్రంబు
లలితోర్ధ్వపుండ్ర లలాటపట్టికయు
సెలవులఁ దేఱెడు చిఱునవ్వులొలుక

ఇంకను మఱికొన్ని గలవు - విస్తరభీతి నుదహరింపనైతిని.

పై యుదాహృతులను పరిశీలించిన రంగనాథ రామాయణ ప్రతులలో వరదరాజు రామాయణమునందలి పంక్తులు యథామాతృకముగాఁ జేర్చబడినవని స్పష్టమగుచున్నది. కాబట్టి రంగనాథ రామాయణ పరిష్కర్తలనుబంధములలో చేర్చినవి కొన్ని నరద రాజు రామాయణమునందలి పంక్తులవలె, తాళ్ళ పాక అన్నమయ్యగారి రామాయణమునందలి పంక్తులుకూడ చేరి నవను నా నిశ్చితాభిప్రాయము నీవఱకే తెలిపియున్నాను. (చూడుడు సుందరకాండ పీఠిక పుట 17) ద్విపద రామాయణములు వరదరాజకృతికిముందు వెలసినవి రంగనాథ, అన్నమయ్యల రామాయణములే యైయున్నవి. వానిలో రెండు గ్రంథములనగా రంగనాథ వరదరాజ కృతులు పూర్తిగ మనకు లభ్య