పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

151

యు ద్ధ కాం డ ము

-: శ్రీరాముఁడు లంక నెట్లు సాధించుటయను విషయముఁ గూర్చి యాలోచన సేయుట :-

ఆవేళ రఘువీరుఁ - డర్కనందనుఁడు
పావని పనసజాం - బవదాంగదులును
నలనీలకుముద మైం - ద్వివిదులును
కలవారలెల్ల నే - కముగాఁగఁ గూడి
"వచ్చితి మొకరీతి - వననిధిఁ దాఁటి 3350
యిచ్చటికీ లంక - యింద్రాదులకును
దేఱి చూడఁగరాదు - దీని సాధింప
నేరుపెట్టిదియకొ - నెమకంగవలయు ”
ననుమాట లాలించి - యసురనాయకుని
యనుజన్ముఁడుచిత వా - క్యముల నిట్లనియె.

-: విభీషణుఁడు రావణుఁడు చేసిన ప్రయత్నమును వివరించుట :-

శరభుఁడు ప్రఘసుడు - సంపాతియనలుఁ
డురు శక్తులప్రధాను - లూహింపఁదనకు
నలువురు పక్షులై - నభములకెగసి
చులకఁగా నాలంకఁజొచ్చి - రావణుని
తెఱఁగెల్లఁగని వచ్చి - తెలిపిరిగానఁ 3360
బరికించి వినుఁడేఱు - పడ వివరింతు
పూర్వసాలద్వార - మున ప్రహస్తుండు
దుర్వారబలముల - తోనున్నవాఁడు
దక్షిణంబున మహో - దర మహాపార్శ్వు
లక్షీణబలశాలు - లై యున్నవార