పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
126

శ్రీ రా మా య ణ ము

జెంతకుఁ దెచ్చినఁ - జేరిన వారి
మంతనంబున నొక - మాట నిట్లనియె.
"రామలక్ష్మణుల మే - రలు విభీషణుని 2780
నేమంబు సుగ్రీవు - ని విచారములును
గపుల యాలోచన - క్రమము నిద్రించు
నపుడెచ్చరికల ను - న్నట్టివైఖరులు
పాళెంబులో మాట - పలుకులు ప్రజల
యేలినవారల - యెడ నోరుములును
నుక్కళమ్ములు గాచి – యున్న వానరుల
యిక్కువలును జూచి - యిపుడెరండ” నుచుఁ

-: ఆ వేగులవారు సుగ్రీవ సైన్యమునుఁ జూచి భయమంది, వానరులచేఁ గొట్టువడి లంకకువచ్చుట :--

బనిచిన వారలం - బరమున కెగసి
చని కననీక ప్ర - చ్చన్నులై నిలిచి
కపుల మేలిమి చూసి - గజగజవణఁకి 2790
యపరిమితంబౌ భ - యంబుచే నొదిగి
కనుచుండ వారలఁ - గని విభీషణుఁడు
వనచరులకు వారు - వచ్చినజాడ
వినిపింప కపులెల్ల - వెంటాడ వెఱచి
వినువీథి నందఱు - విచ్చి పాఱుటయు
నందులో శార్దూలుఁ - డనువాఁడు దగుల
ముందల పట్టుక - ముగియఁ దన్నుచును
పీడింపఁ గూ తలు - వెట్టి “ నాపాటుఁ