97
యు ద్ధ కాం డ ము
సమయింపు చున్నారు - జలజంతువులను
వారి నేయుమటన్న - వనధి జూడంగ
శ్రీరామ విభుఁడు వై - చెను మహాస్త్రంబు
నేఁడును నాఁడు నీ - నిశితా స్త్రవరము
గాడిన ధర మరు - కాంతారమయ్యె.
ఆరసాతలముగా - నమ్ము ధరిత్రి
గోరాడుచో వ్రణ - కూపమనంగ
నొక నీటిబుగ్గ పై - కుబికి వేసవుల
నకలుషాంబుప్రవా - హమున జాలెత్తె.
ఆనీరు గ్రోలిన - యావులపాఁడి 2190
హేరాళముగనందు - నెనసియున్నట్టి
వనములంచితఫల - వ్రాతంబుతోడఁ
దనరఁ గావించె సీ - తామనోహరుఁడు.
ఆవేళ వారిధి - యంజలిఁ జేసి
భావి కార్యవిచార - పరతనిట్లనియె.
–: సముద్రునికోర్కెపై శ్రీ రాముఁడు నలుని సేతువుగట్ట నాజ్ఞాపించుట :-
"అనఘ స్రష్టకుమారుఁ - డైన యీనలుఁడు
తన తండ్రివరము లెం - తయుఁ గన్నవాఁడు
వారిలోఁ దరుగిరి - వ్రాతంబువైచి
శ్రీరామ! యితరుల - చేఁ గట్టగాఁదు
ఆయన తనతండ్రి - యంతటివాఁడు 2200
సేయు మిట్లని పల్కె - సింధువల్లభుఁడు
తోడ నదృశ్యుఁడై - తొలఁగినభక్తి