పుట:Sri Ramayanamu Sundara Kanda Katta Varadaraju 1952 251 P 2030020024835.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

175

సుం ద ర కాం డ ము

తైలంబులో నది - దరికొల్పి వారు
పురవీథులను మెడఁ - బువ్వులు చుట్టి
హరివీరు పంచవా - ద్యంబులు మొఱయ4120
బాలకుల్ వెం - బడి బడి కూఁతలిడుచుఁ
గోలచేఁ దోలుచు - కొని పోవుచుండ
"చీకటివేళఁ జొ - చ్చితి లంక నేను
తేఁకువ వీథివీ - థికిఁ జూడలేదు.
దివిటీలు వీరు దై - తేయులు నాకు
రవులు కొల్పిన తోఁక - రాఁజినవెనక
నా వెలుఁగున పురం - బంతయుఁ జూచి
కావలసిన లంకఁ - గాల్చి పోయెదను!”
అని యూరకేపోవు - నప్పుడీ వార్త
దనుజకాంతలు మహీ - తనయతోఁ దెల్పఁ 4130
జింతించి యిందు వ - చ్చినవాఁడ వేల
యింత సేసితి వింక - నేమి సేయుదును?”

-:సీతకు హనుమంతుని వృత్తాంతము దెలిసి యాతని కగ్ని యంటక, చల్లగానుండున ట్లామె వర మొసంగుట :-

అని "యేఁ బతివ్రత - నైతినే నిపుడె
యనలుఁడు కడుచల్ల - నై యుండుగాక!
రామునిఁ దక్క ప - రవ్య క్తులందు
నేమది నిలుపని -యిది నిక్కమేని
యనిలకుమార! నీ - కాపద లేక
యనలుఁడు కడుచల్ల - నై యుండుగాక!