పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరణ్యకాండము

41

యేను వచ్చుటయు నీ - వెఱిఁగింపు" మనుచు
నానతి యొసఁగిన - నటుల లక్మణుఁడు
నాకుంభజుని శిష్యు- నచ్చోటఁజూచి
వాకొన్న సౌమిత్రి - వచనంగతికి

-:శ్రీరామాగస్త్యుల సమావేశము:-


ఆచార్యసన్నిధి - కరిగియోదేవ!
“రాచవారిద్దఱు - రమణి యొక్కతెయు
భానువంశజులఁట! - పరికింపఁదమకు
జానకిరామల - క్ష్మణులఁట! పేళ్లు
దశరథసుతులఁట! - తమతండ్రి పనుపఁ
గృశియించి వనులఁ జ - రింపుచు మిమ్ము. 950
సేవింపఁదమరు వ - చ్చిరఁట! లక్ష్మణుఁడు
తావచ్చినాఁడు సీ - తారఘువరులు
కడనున్నవారఁట! - క్రమ్మఱ యేమి
నుడువుదు? నానతిం - డు మహాత్మ!" యనినఁ
“గ్రక్కునం బిలువుమె - క్కడ నున్నవాఁడు?
నిక్కము నేరాము -నిం గనవేడి
యెదురులు చూచితి - మిన్నాళ్లు నట్టి
సదయావలోకుఁ గౌ- సల్యాకుమారు
దశరథతనయు సీ - తామనోహరుని
శశివదనుని రామ - చంద్రుఁ దో తెమ్ము 960
పొ"మ్మన్న శిష్యుఁ డ - ప్పుడువచ్చి కరత
లమ్ములు మొగిచి యా - లక్ష్మణుఁ జూచి;
“ఎక్కడున్నాఁడొ - యిపుడు మీయన్న