పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

శ్రీరామాయణము

వాఁడు జీర్ణించి వై - వస్వతు పురికి
నేఁడేఁగె! వచ్చునే - నీవు పిల్చినను? 870
"ఓరి! జగద్రోహి!- యోడక మునుల
నీరీతిఁ జంపితి - రిన్నాళ్లు మీరు!
అట్టి పాపములెల్ల - ననుభవింపంగఁ
గట్టడి చేసితిఁ - గడతేర్తు నిన్ను
ననవిని వాడాగ్ర - హంబుతోఁ గదియ
మునిశిఖామణి బొమల్ - ముడిగొనుచుండ
గోపించినన్ గుప్పఁ - గూరగాఁ బడియె
నాపాపమతి భస్మ- మై నిమేషమున
నామాడ్కి నిల్వలు - నడచిన యట్టి
యమహాత్ముని భ్రాత - యాశ్రమంబునకు 880
వచ్చితి ” మనునంత - వనజబాంధవుఁడు
వచ్చెను బశ్చిమ - వనధి చెంగటికి
నావేళ వారగ - స్త్యభ్రాతఁ జేరి
సేవించి యమ్మౌని - చేఁ బూజలంది
యతని యాశ్రమమున - నారేయి యెల్ల
క్షితిసుతతో నిద్ర - చేసి వేకువను
నిత్యకృత్యంబు ల - న్నియుఁ దీర్చి పరమ
సత్యసంధుండు - దాశరథి యావేళ
నాయగస్త్యభ్రాత - యనుమతి నతఁడు
చేయి చూపినత్రోవ - సీత దోడ్కొనుచుఁ 890

-:అగస్త్యాశ్రమ వర్ణనము:-



జనిచని భల్లకా-సరరిక్షగవయ
వనచరకరకిరి - వ్యాఘ్రపంచాస్య