పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

93

భేదించి, వైష్ణవ పదారోహణంబు సేయువాఁడ నిర్భయుండై, మెల్లన ( లింగదేహంబున )

బృథివ్యాత్మకత్వంబు నొంది, యట్టి పృథివ్యాప్తకత్వంబున ఘ్రాణంబునం గంధంబును, జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబున, తేజోరూపకత్వంబున దర్శనంబున

రూపంబును, సమీరణాత్మకత్వంబున డెహంబున స్పర్శనంబును, గగనాత్మకత్వంబున శ్రవణంబున శబ్దంబును నతిక్రమించి భూత సూక్ష్మేంద్రియ లయస్థానంబైన

యహంకారావరణ సంప్రాప్తుండై, యందు మనోమయంబును దేవమయంబును నైన సాత్త్వకాహంకార గమనంబున మహత్తత్త్వంబున సొచ్చి గుణత్రయంబును లయించిన

ప్రధానంబు నొంది, ప్రధానాత్మకత్వంబున దేహంబు నుపాధి పరంపరావసానంబునం బ్రకృతిం బాపి యానందమయుండై యానందంబునం బరమాత్మ రూపంబైన వాసుదేవ

బ్రహ్మమందుఁ గలియు నని చెప్పి వెండియు నిట్లనియె. ( 32 ).


ఆ. పరమ భాగతులు పాటించు పథ మిది, యా పథమున యోగి యరిగె నేని

మగుడి రాఁడు వాఁడు మఱి సంశయము లేదు, కల్పశతములైన కౌరవేంద్ర ! (33 ).


వ. వినుము. నీవడిగిన సద్యోముక్తియుఁ గ్రామముక్తియు ననియెడు నీ రెండుమార్గంబులు వేదగీతంబులందు వివరింపంబడియె. వీనిం జాల్లి భగవంతుండైన వాసుదేవుండు

బ్రహచేత నారాధితుండై చెప్పె, సంపార ప్రవిష్టుండైన వానికిఁ కంటె సులభంబు లేదు. ( 34 ).

శుకుఁడు పరీక్షిత్తునకు భక్తిమార్గంబె ముఖ్యంబని తెలుపుట

మ. విను మంభోజభవుండు మున్ను మదిలో వేదంబు ముమ్మాఱు మ

ర్మనయజ్ఞత్వము దోఁప నంతయుఁ బరామర్శించి మోక్షంబు ద

క్కిన మార్గంబులవెంట లేదనుచు భక్తిం జింతసేసెన్ జనా

ర్దను నాత్మకృతి నిర్వికారుఁ డగుచున్ దన్మార్గ నిర్ణేతయై. (35)


సీ. అఖిలభూతములందు నాత్మరూపంబున నీశుండు హరి యుండు నెల్ల ప్రొద్దు

బుద్ధ్యాది లక్షణంబులఁ గానఁబడు మహోసేనీయు డహర్నిశమ్ణూ

వందనీయుఁడు భక్తవాత్సల్య సంతతబు నియతబుద్ధి

నాత్మరూపకుఁ డగు హరి కథామృతములు గర్ణపుటంబుల గాంక్షదీరఁ

తే. గ్రోలుచుండెడి ధన్యులు గిటిల బహిళ, విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి

విష్ణుదేవుని చరణారవిందయుగము, కడకుఁ జనుదురు సిద్ధంబు కొరవేంద్ర. (36)