పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76


తే. నలఘు రురుచర్మధారియై యలడుచున్న, తపసిఁ బొడగని శోషిత తాలుఁడగుచు

నెండి తడిలేని కుత్తుక నెలుఁగు డింద, మందభాషల డగ్గఱి మనుజవిభుఁడు. (455)


క. తోయములు దెమ్మ మా కిఇ, తోయము వేఁటాడువేళఁ దిల్లి పొడమ దీ

తోయముక్రియ జలదాఅహము, తోయమువారలును లేరు దుస్సహ మనఘా !(456)


వ. అని భూవరుండు శమీకమహాముని సమాధినిష్ఠుండును హరిచింతాపరుండునై యుండుట విచారింపక. (457)


ఉ. కన్నులుమూసి బ్రాహ్మణుఁడు గర్వముతోడుత నున్నవాఁ డు చే

సన్నలనైన రమ్మనఁడు సాజలంబులు దెచ్చె పోయఁ డే

మన్ననలైనఁ జేయఁడు సమగ్రఫలంబులు వెట్టఁ డింత సం

పన్నత నొందెనే ? తన తపశ్చర ణాప్రతిమ ప్రభావముల్. (458)


ఆ. వారిఁ గోరుచున్నవారికి శీతల, వారి నిడుట యెట్టివారికైన

వారితంబు గాని వలసిన ధర్మంబు, వారి యిడఁడు దాహవారి గాఁదు. (459)


చ. అని మనుజేశ్వరుండు మృగయావనరాయత తోయదాహ సం

జనిత దురంతరోషనున సంయమి దన్నుఁ దిరస్కరించి పూ

జనముల సేయఁ డంచు మృతసర్పము నొక్కటి వింటికోపునన్

బనివడి తెచ్చి వైచె నట బ్రహ్మమునీంద్రుని యంసవేదికన్. (460)


వ. ఇట్లు వృథా రోషదర్పంబున మునిమూఁపున గతానువైన సర్పంబు నిడి, నరేశ్వరుండు దన పురంబున జనియె. అంత సమీపవర్తులైన మినికుమారులు సూచి శమీకనందనుండైన శృంగికడకుం జని. (461)


క. నర గంధగజ స్యందన, తురగంబుల నేల రాజు తోయాతురుఁడై

పరగ న్నీ జనకునిమెడ, నురగముఁ దగిలించి పోయె నోడక తండ్రీ ! (462)


వ. అని పలికిన సమాన రూప మునికుమార లీలసంగియైన శృంగి శృంగంబులతోడి మూర్తి ధరియించినట విజృంభించి రోషసంరంభంబున నదరిపడి ( బల్యన్నంబుల భుజించి పుష్టంబులగు నరిష్టంబులం బోలె బలిసియు, ద్వారంబులం గాచికొనియుండు సారమేయంబులపగిది దాసభాతులగు క్షత్రియాభాసు లెట్ల బహ్మణోత్తములచే స్వరక్షకులుగ నిరూపితులైరి ? అట్టివారి లెట్లు తద్గృహంబుల భాండసహితంబగు నన్నంబు భుజింప నర్హులగుదురు ? తత్కృతంబులైన ద్రోహంబు లెట్లు నిజస్వామిం జెందు నని మఱియు ) నిట్లనియె. (463)