పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66


సీ. అంత నాతని తమ్ము లనిన పుత్రాదులు గలిరాకచేఁ బాపకర్మ లగుచుఁ

బరియించు ప్రజల సంచారంబు లీక్షించి యఖిల ధర్మంబుల నాచరించి

వైకుంఠ చరణాబ్జ వర్తత హృదయులై తద్భక్త నిర్మలత్వమును జెంది

విషయ యుక్తులకుఁ బ్రవేశింపఁగా రాక నిర్ధూత కల్మష నిపుణ మతులు

తే. బహుళ విజ్ఞానదావాగ్ని భసిత కర్మ, లైన యేకాంతులకు లక్ష్యమై వెలుంగు

ముఖ్య నారాయణ స్థానమునకుఁ జనిరి, విగతరజ మైన యాత్మల విప్రవర్య ! (385)


వ. అంత విదురుండు ప్రభాసతీర్థంబున హరియందుఁ జిత్తంబు సేర్చి, శరీరంబు విడిచి, పితృవర్గంబుతోద దండధరుం డగుటంజేసి నిజాధాకార స్థానంబునకుల జనియె ద్రుపదరాజ పుత్రియు పతులవలన ననపేక్షితయై వాసుదేవునందుఁ జిత్తంబు సేర్చి తత్పదంబు సేరె. ఇట్లు, (386)


క. పాండవ కృష్ణుల యానము, పాండురమతి నెవ్వఁడైన బలికిన విన్నన్

ఖండిత భవుఁడై హరిదా, సుండై కైవల్యపదము సొచ్చు నరేంద్రా ! (387)

అధ్యాయము - 16

వ. అంత నటం బరీక్షి త్కుమారుండు జాతకర్మవిదులైన భూసురోత్తమ శిక్షావశంబున మహాభాగవతుండై, ధరణీపాలనంబు సేయుచు, నుత్తరుని పుత్రిక నిరాపతియను మత్తకాశినిం బెండ్లియాడి, జనమేజయ ప్రముఖులైన నలువురు కొడుకుల నుత్పాదించి, గంగాతటంబునఁ గృపాచార్యుండు గురువై యుండ, యాగభాగంబులకు వచ్చిన దేవతల నీక్షింపుచు, భూరి దక్షిణంబులుగా మూఁడశ్వమేధంబు లాచరించి, దిగ్విజయకాలంబున గోమిథునంబుఁ దన్నుచుబ్బ శూద్రుండును, రాజచిహ్న ముద్రితుండు నగు కలిం బట్టి నిగ్రహించె. అని చెప్పిన శౌనకుండు పొరాణికున కిట్లనియె. (388)

పరీక్షిన్మహారాజు భూ, ధర్మదేవతల సంవాదం బాలకించుట

క. భూవరరూపుఁడు శుద్రుఁడు, గోవుం దా నేల తన్నెఁ ? గోరి పరీక్షి

ద్భూవరుఁడు దిశల గెలుచుచు, నేవిధి,ఁ హలి నిగ్రహించె ? నెఱిఁగింపఁగదే. (389)


మ. అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులై యున్న స

త్పురుషశ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్భుద్ధిన్ విలంఘించి దు

ర్నర వాథకథన ప్రపంచములు గర్ణప్రాప్తముల్ సేసి వా

సరముల్ వ్యర్థతఁ ద్రొబ్బుచుండఁ జన దీ సంసార మోహంబునన్, (390)