పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64


క. భూతములవలన్ నెప్పుడు భూతములకు జన్మ మరణ పోష్ణములు ని

ర్ణీతములు సేయుచుండును, భూతమయుం డిశ్వరుండు భూపవరేణ్యా ! (375)


క. బలములుగల మీనంబులు, బలవిరహిత మీనములను భక్షించుక్రియన్

బలవంతులైన యదువులు, బలరహితులఱై జంపి రహితభావముల నృపా ! (376)


మ. బలహీనాంగులకున్ బలాధీకులకుం బ్రత్యర్థి భావోద్యమం

బులు గల్పించి, వినాశము న్నెఱపి యీ భూభారముం బాపి, ని

శ్చలబుద్ధిన్ గృతకార్యుఁడై చనియె నా సర్వేశ్వరుం డచ్యుతుం

డలఘుం డేమని చెప్పుదున్ ! భగవదీ యాయత్త ముర్వీశ్వర ! (377)


వ. మఱియు దేశ కాలార్థ యుక్తంబులు, నంతఃకరణ సంతాపశమనంబులు నైన హరి వచనంబులం దలంచి, చిత్తంబు పరాయత్తంబై యున్నది. అని యన్నకుం జెప్పి. నిరుత్తరుండై దలంచి చరణారవింద చింతామలబుద్ధియై, శోకంబు వర్ణంచి, సదా ధ్యాన భక్తవిశేషంబులం గామక్రోధాదుల జయించి తొల్లి తన కుభయసేనా మధ్యంబున ననంతం డానతిచ్చిన గీతలు దలంచి, కాలకర్మ భోగాభినివేశంబుల చేత నావృత్తంబైన విజ్ఞానంబు గ్రమ్మఱ నధిగమించి, శోక హేతు వహంకార మమకారాత్మకంబైన ద్వైతభ్రమం బనియును, ద్వైత భ్రమంబులకుఁ గారణంబు దేహంబనియును, దేహంబునకు బీజంబు లింగం బనియును, లింగంబునకు మూలంబు గుణంబు లనియును, గుణములకు నిదానము ప్రకృతియనియును, బ్రహ్మాహ మనియెడు జ్ఞానంబున లీనయై ప్రకృతి లేకుండుననియు ( ప్రకృతి యడంగుటయ నైర్గుణ్యంబువలనః గార్యలింగ నాశంబనియును గార్య లింగ నాశంబున నసంభవం బగు ననియును ) ప్రకృతిం బాసి క్రమ్మఱ స్థూలశరీర ప్రాప్తుండు గాక పురుషుండు సమ్యగ్భోగంబున నుండు ననియును, నిశ్చయించి , యర్జునుండు విరక్తుండై యూరకుండె. ధర్మజుండు భగవదీయ మార్గంబు దెలిసి, యాదవుల సాశంబు విని, నారదు వచనంబు దలంచి. నిశ్చలచిత్తుండై స్వర్గగమనంబునకు యత్నంబు సేయుచుండె, ఆ సమయంబున, (378)


క. యదువుల నాశము మాధవు, పదవియు విని కుంతి విమలభక్తిన్ భగవ

త్పదచింతా తత్పరయై, ముదమున సంసార మార్గమునకుం బాసెన్. (379)

వ. ఇట్లు కంటకంబునం గంట కోన్మూలనంబు సేసి కంటకంబులు రెంటినిం బరిహరించు నిన్నాణి తెఱంగున, యావరూప శరీరంబునంజేసి యీశ్వరుండు లోకకంటక