పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ii


వామనునికిఁ దర్వాతివాఁడగు విశ్వనాధకవిరాజు వచనము నాల్గుదెఱఁగుల విభాగించెను. వృత్తలేశ విహీనమయిన గద్యము ముక్తకము వృత్తగంధి ఉత్కలికాప్రాయము చూర్ణకమునని నాలుగు విధములు. తొలిది సమాసరహితము. రెండవది వృత్తభాగములతోఁ గూడుకొన్నట్టిది. మూడవది దీర్ఘసమాసాఢ్యము; నాలవది అల్పసమాసకము.

పయి రచనాప్రభేధములలో రెండింటికి మాత్రము తెలుఁగున భారతాది కృతులలోని వచన భాగములనుండి లక్ష్యము లెత్తి చూపవచ్చును. ప్రాయికముగాఁ గవిత్రయమువారి రచనలలోని వచన రచనములు చూర్ణకము లనఁదగినవి. నాచనసోమన, పోతన ప్రభృతుల రచనలు గొన్ని యుత్కలికా ప్రాయము లనవచ్చును. వృత్తగంధిరచనలు తెలుఁగునఁ బ్రాచీనకాలమున నంతగా లేవు. ప్రబంధరాజ వెంకటేశ్వరవిలాసమున వృత్తగంధి వచనరచనలున్నవి. నేఁటికాలమున శ్రీగిడుగు రామమూర్తిపంతులుగారు రచించిన 'ప్రాఁదెనుఁగుఁగమ్మ'1 వృత్తగంధియే. మచ్చుతునుక :____

సిరిఁదాల్చుఱేఁడోగిఁ జిన్ని చూడ్కులఁజూచు తెనుఁగుఁ. జదువులరచ్చ తీర్పరులార ! గ్రిందనుగై వ్రాలుసేసిననేనయా ! యణకువమెఱయుచు, నాయోపుకొలఁది. దెనుఁగుఁజదువులగుఱిచి, జానుమివులంగఁ దొలితెనుఁగునుడులన తేటతెల్లగను, విన్నపమొక్కండు వినిపింతుమిమ్ము మోడ్చియునిరుచేయి, మ్రోఁకరిలఁబడియు, నెఱఁగియుఁ గైవారమొనరంగఁచేసి, తద్దయువేఁడుదు నాలింపుఁడయ్య మీరపోలెను నేనుఁ బ్రాఁబొత్తములు సాలఁజదువులేన.

కర్ణాటకమునఁగూడ వృత్తగంధి రచనములున్నవి. రామాశ్వమేధాదులందు లక్ష్యములు చూడనగును.

సంస్కృతమున వామనుఁడుపేర్కొన్న ముత్తెఱఁగుల రచనములునున్నవి. కాదంబరీ, దశకుమారచరిత్ర, యశస్తిలాకాచంపూప్రభృ


1చూ . ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక సంపుటము ౨ సంచిక ౩