ద్వాపర ము
ద్వాపరమున నూతనధర్మపీడలు వెలువడినవి. రాజ్య తృష్ణ విపరీతముగఁ బెంపొందినది. శంతనుఁడు జ్యేష్ట బ్రాత యయిన దేవాపీనీ రాజ్యభ్రష్టునిగావించి, యడవులకంపి తాను రాజయ్యను. వీని సంతతి యైన కురుపాండవులు కూర్చుండనొల్లక పొళ్ళు కుదురక తాము కోట్టుకొని చచ్చుట యేగాక భారతఖండమునంతయు ర క్త ప్లావితమును జేసి, భారత దేశమున దరిద్ర దేవతను దాండవింపఁ జేసిరి. ధరణీ రాజ్య మీతరులకుఁ జేరునేమో యను చింతాశల్వముచే గళత్రము లను బరులవద్దకంపి సంతానమును బడయుటకు వెనుదీయ రైరి. [1]* 'బహుపతిత్వము చరమదశయందుండెను. గోమాంసభక్షణము మానఁబడెను. గోమేధము, ' సర మేధములు లుప్తముల య్యెను. అశ్వ మేధము మాత్రము సకలు సాగు చుండెను. ఆశ్వమాంసభ త ణము నేఁడు జర్శనులయందు స్నది. సురాపానము వెనుకకు మరలినట్లు కన్పడదు. బల రాముఁడు సురాపాన ప్రియుఁడు. వీనికి సభౌపూజ్యత కల్లు చునే యుండెను.” యాదవ ప్రళయమునకు సురాపానమే మూల "కారణము. విప్రముఖంబుననే విద్య ప్రవర్తిల్లవలయునను .
..............................................................................................................................
35
- ↑ పొండవజననము, దృత రాష్ట్ర పాండురాజుల జన్మము; ఆత్మకుని జన్మము, ఆంగ రాజు జనసము - భారతము