________________
9 వ ణుఁ డు చుండిరి. వరునిఁజకు దేశ దేశముల గాలించిరి. తుదకు దమకూతురునకు విశ్రవసుఁడు , తగినవాఁడని నిశ్చయించి, సాలంకృతముగాఁ కసినీ విశ్రవసునికిఁ గన్యాసముఁ జేసిరి. జాత్యుద్ధారకుండయిన వుతుని బొందుటకయి ఋషిని భయ భక్తులతో సేవింప, తండ్రులు కైకసికి బోధించి పంపిరి. కోన్ని సొళ్ళకు కైకసి గర్భవతియై రూపలావణ్యములు గలవానిని, తేజఓజములు కలవానిని తొలుచూలునిఁ గొంచెను. ఇతఁడే దశకంఠుఁడు. నుమాలీ మాల్యవంతులు మనుమని జూచి యుప్పొంగిపోయిరి. నేఁటి కవమానమును గడవ సమర్థుల మైతి మనుకొనిరి. పెంచిరి, పెద్దనుజేసిరి. విద్యాబుద్ధులు చెప్పించిరి. నీతిశాస్త్ర పారంగతుని చేసి, రణకోవిదుని జేసిరి. జాత్యభిమానము నుగ్గు బాలతోడనే రంగరించి పోసిరి. చెవి నిల్లు:గట్టుకొని నిత్యము జాతికిఁగల్గిన యవమానమును జటి చెప్పిరి. పర్యవసానిమితఁడు లోక జేతయై, యక్షులందో లంకను స్వాధీనముఁ జేసికొని, కుల తలంకమును దొలఁగించి, జాతిగౌరవమును గాడెను. తాతల యభీష్టమును సంపూ ర్ణముగాఁ దీర్చెను. పతనముఁ జెందిన స్వజాతి నుద్ధరించి సర్వ లోకములను దనకీ ర్తిచే నింపి నేచెను. ఆ | రావణ కుంభకర్ణ విభీషణుల కళతములఁ గూర్చీ యొకటి రెండుమాటలు చెప్పవలసి యున్నది. రావణునీ యర్థాంగి మండోదరి యసురశిల్పియగు మయుని కుమార్తె. మయునకు సచ్చర లేమయగు హేమయను నా మెయందు 4