పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________


యచ్చటచ్చటఁ బొడగట్టుచుండును, కారణజన్ముడు, జూత్యుద్ధారకుఁడు. మాలి, సుమాలి, మాల్యవంతుఁడు నను మువ్వురు రాతన నాయకులు లంకాపురిని నీవాసముగాఁ జేసికొని సురలపై దండెత్తి పెక్కుమారులు, వారల నొడిచివచ్చి, పరాభూతులం జేసిరి. ఈ నీరంతర పరాభవముచే దేవతలు విషణ్ణులై, విష్ణువుని బార్ధింప నాతండును నడుముగట్టిని దేవతలపశమై పోరికీ నడచివచ్చెను. ఇరుగులవారికి, హోరాహోరీ పోరు ఘోరంబయ్యె. తుదకు నీ దారుణ సంగ్రామంబున రాక్షసులు పరాజితులయిరీ, మాలి వీరశయ నంబు నందెను. చేయునది లేక సుమాలి మాల్యవంతులు సకు టుంబ సపరివారముగా లంకనుడించి రసాతలంబున కేగిరి. అందుండియు పోరు సుఖ మెతుంగరై, కేలు కంటఁ గూర్కె జుంగ రైరి. పరాజయ చింతాశల్యముచే సమసి, నవసి, యేట్టుల నేనియు విరోధులం దునుమాడ మార్గముల నెమరు చుండిరి. సుమాలి కుమార్తెయయిన కైకసి, రూపలావణ్య ముల కలదానిని, జాత్యభిమానపూర్ణహృదయయగు దానిని ద్రావిడ సంప్రదాయమును సంపూర్ణముగ నెటీంగినదానిని ద్రావిడాచారముల నెల్ల మిగుల నేర్పుతోఁ దల కెక్కించు కొనిన దానిని మహా తేజోవంతుఁడగు వీరాధివీరున కిచ్చి జాత్యుద్ధారకుని బుట్టించి, తన్మూలమున జాత్యవమానంబును దుడిచివేయవలయునని, సుమాలి మాల్యవంతులు తలపోయు