తొలిపలుకులు.
“ఆర్య స్త్రైవర్ణికః” యని పూర్వులు నిరాఘాటంబుగ
వాకొనియున్నారు. దీని యర్థ మేమి ! ద్విజులని నేఁడు వ్యవహ
రింపఁబడుచున్న మూఁడుకులములవారేయార్య లోకంబునకుఁ
చెందిన వారని పూర్వుల యభిప్రాయము. అయినచో శూద్రు
లని కలగూరగంపగా వర్తమాసంబున వ్యవహరింపఁబడుచున్న
నాల్గవ జాతివారి యుపప త్తి యేమి ? ఎవ్వరువీరు ? చిర కాలము
నుండి సామాన్య స్వత్వదూరులయి వీరు నీచదశం బొరలాడు
టకుఁ గారణ మేమి ? స్మృతులయందుఁ జెప్పఁబడిన వీరి జన్మ
కథనము నిజమయిన దేనా ? నిజముగ స్మృతులు వీరికొనంగిన
స్థానమేనా వ్యావహారిక మునందుఁ జెల్లినది, చెల్లుచుండినది ?
స్మృతివాక్యములకు నాబారమునకు భేద మెట్లు తటస్థించినది ?
స్మార్త ధర్మవిరుద్ధముగ దక్షిణాపథమున వీరికిఁ బ్రజాపాలనము,
సేనాపతిత్వము, మంత్రిత్వ మెట్లు లభించినది ? ఈ యంశ
ముల నన్నింటిని గూలంకషముగను, నిప్పాక్షికముగను, సని
తర్కముగను జర్చించుట మా విధియని నమ్మి యిప్పుడద్దాని
కుపక్రమించుచుంటిమి.
ఉపర్యు దాహృతమగు లోకో క్తినిబట్టి శూద్రశబ్ద
వాచ్యులయిన మానవులు 'ఆర్యులు' కాక 'అనార్యులని
మాత్రము స్పష్టముగఁ దేలుచున్న ది. అయినచో నీయనార్యు
9