పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


.

గుడులలోనికిఁ బోవుటఁ గూడదనిరి
బడులలోనికిఁ బోవుట పాపమనిరి
మడులఁ గట్టుకొను టధర్మమార్గమనిరి
చటుల దుస్తంత్ర - దధ్యసార మౌర !


ప్రజల సపలపింపఁగఁ గైతవంబుచేత
స్మృతుల వ్రాయించినారు పండితుల చేత
దావిడులు మ్లేచ్ఛ జాతి వారలని; కలదె
పాపపరిహార మిటువంటి వంచకులకు !



చింతాలేశము లేకయె
యంతఃకరణ ప్రవృత్తి నావల నిడుచున్
సంతోషముతోఁ దెగఁబడి
యెంతెంతలు చేసినార లేమివచింతున్ !


వసంబునున్
ఈవగఁగుత్స తాత్ములయి యెంతయు ద్రావిడమాసంనన్
నోషగఁజేసి యార్యులు మనోరథసిద్ధిని బొంద లేక "తా
నవగ నేని తంత్రము వహించుచు వారల స్థూల దేహముల్
బోవఁగఁ జేయఁగా మససుపుట్టినఁ బట్టనిగట్టి కీస్కతో.


ఆర్యనవోడలుగొని యనార్యులు పెండిలియాడ వర్ణ సాం
కర్యముకల్గి యున్నతి గకావికలౌనని దూరదృషిచే
నార్యసభాపతుల్ స్మృతులయందున వ్రాసిరి ద్రావిడాళి త
త్కార్య మొనర్చినన్ గఠిన దండనలం బొరిపుత్తుమం చొగిన్,


69