పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయానము


నేడును వింధ్య పర్వతపు నెత్తములందునఁ జెంచువారు మ
ల్లాడుచు: గాన నౌదురు, ప్రయత్నము లేక యె చింకిగుడ్డ లున్
వాడి శరంబులుక బలుక వాలును దాలీచి భీకరంబుగా
గూడెము వీడి, తేనియలకోసము చెట్టుల నెక్కి దిగ్గుచున్ |



శూద్రులు, శూద్రశబ్దవ్యుత్పత్తి



ద్రావిడయోధు లీగతిఁ బరాజితులై చన నార్య సైనికుల్ !
త్రోవల నడ్డగించి 'పెఱతోయము నారల నెల్లఁ బట్టి త
జ్జీవములన్' హరించుచు విశృంఖలు లై విహరించి రక్కటా
కేవల దుష్టబుద్ధిఁ దమకించిత్యజించి సమీక ధర్మమున్ ,


పారుబోతులుఁ బందలు బడుగువారు
బవరమున వికలాంగులై పడినవారు
చేతఁబడఁ బోయకట్టులఁ జేర్చి పెట్టి
రార్యు లానందర సమగ్ను లగుచుఁ బిదప.


సందియమందక కుందక
యందుండిన భబులనెల్ల నా వేశముతో
బండెలలోఁ బడఁగొట్టియుఁ
గుందింపఁగ మొదలు పెట్టి కుత్సితు లగుచున్ .

63