పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీయా శ్వా న ము


విష్టత్రయమందు విజ్ఞుఁ డెవ్వెండేని
             తసము సల్పుచునున్నఁ దల్ల డిలును
తనకోంప గూలిపోయినరీతి నాహార
              పానీయములు మాని పల్టిలును
అసమర్థుడై భీరువై ప్రతీకారంబు
              బచరింపఁజూలు నిబ్బరము లేక
మంత్ర తంత్రంబుల మాటు న జవరాండ్ర
             మాలిమితో బతిమాలి, యింటి


పట్టునం బదినాళ్ళేని పట్టునునుచుఁ
గుడిచి కూర్చుండనీయుడీ కుత్సితుండు
రేయిఁ బవ లెల్ల లోకముల్ ద్రిమ్మరంగ
జెప్పి పంపించు పంపించుఁ దనమాట చెల్లునను


ఆడు తోడున బుట్టినవాడు కాడో
ఆడువారల అగచాట్ల నాలకించి
యాదరింపడు స్వర్గం నందు నున్న
వేల్పు సానులగతు లిట్లు వేగు చుండె.


అంటు రోషించి మంత్రదుద్ధ భుజంగమ వోలె నాభుజంగి చేయునది లేక నిట్టూర్పు విడచి...........


27