సూ త పురాణము
అని సంశయగ స్తంబగు మసంబుతోఁ గొంతనడి విత
ర్కించి.యమ్మహాపతివ్రత వాక్యంబులు తిరస్కరింపనోడి ధర్మ
శీలుండగు ధర్మవ్యాధునిం జేరి వినయంబున----
నళినదళాక్షి వంపఁగ సనాతన ధర్మజిఘృక్షచే మిమున్
గలిసికొసంగ వచ్చితిని గాఫున మీరు విశిష్టధర్మని
జులు ననుఁబాఱజుజూచి పరిశుద్దమనస్కత ధర్మసూక్ష్మముల్
దెలిపిన పెంట నెరిగి దివ్యపదంబును బొందవచ్చితిన్.
అని యిట్లు విన్న వింప ధర్మవ్యాధుండు సెలవులనుండి తొంగిచూచు మందహాసంబుతో నిట్లనియె...
పరిభవబుద్ధి నీవు బహు పాత్కు మందున నున్న కొక్కెరన్
మరణముపాలు సేయుటయు, మానినితో 'నినదించి కోపివై
పరుసని మాటలాడుటయుఁబానలు వాపుకొనంగ వచ్చుటే
నెరిగినవాఁడఁగాని వచియింపఁగ వద్దిక నీయుదంతమున్. .
ధర్శవ్యాధుని దివ్యజ్ఞాసమునకు విస్మయపడి కౌశీకుం డేన పడక మనఃపూర్వకముగా సేవించి, యా మహనీయునిచే బోధితుండయి ధర్మంబులనెల్ల నెంగి, కృతకృత్యుండయి కాలానుసరణంబుగఁ గోలగోచరుండై ముక్తపదంనొందెను.
బోయయు జామయు గురులై
మాయు రె! యొక విప్రు ధర్మ మార్గానుగతున్
చేయుట యెరిగియు మీరీటు
సాయని సం దేహమేల పడగా వలసెస్ ,
108