పుట:Sinhagiri-Vachanamulu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

పరమాచ్యారులెవ్వరు' అంటారు. అంటే మీపాలిటి రామానుజులెవ్వరని అర్ధం. అట్లాగే “మా పరమాచార్యులైన పొతకమూరి భాగవతుల కృపవలన" అంటారు. తనపాలిటి శ్రీమద్రామానుజులు పోతకమూరి భాగవతులని భావం. వార్ని వర్ణిస్తూ “ఎంబెరుమా నార్ల స్వరూపులైన స్వాములు' అనటంలో ఆప్రతిపత్తి ప్రకటితమౌతుంది.

శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రముఖస్థానం వహించిన 'రహస్యత్రయం' పలుతావుల ప్రస్తావించబడ్డది. తత్రాపి ద్వయాధికారి పైలక్షణ్యాన్ని విశేషతః ప్రబోధిస్తారు. ఇది శ్రీవైష్ణవంలో మరో మెట్టు. రహాస్యత్రయం:-తిరుమంత్రం. ద్వయమంత్రం. చరమ మంత్రం.

1)

"తిరుమంత్రమును విన్నపము చేసిరి"
'తిరుమంత్రా పేక్షలను"
"అష్టాక్షరీ మంత్రోపదేశము"

ఇట్లా పేర్కొనటమేకాక అష్టాక్షరీసంపుటితోనే ఒకవచనం కీర్తిస్తారు.

2)

"ద్వయము బ్రహ్మజ్ఞానమూర్తీ లోను. మా సింహగిరి నరహరి పదధ్యానమందును దొరుకును.”
"ద్వయమును పఠించిరి.
“ద్వయమునకధికారియేంతటివాడు ?
.........తన్ను దానెఱుంగక
దూషించు కపటాచారడాంబిక పరుండు ద్వయాధికారియగునే"
“మీ దీవ్యమంగళంబైన ద్వయ ........."
"ఆద్వయమనవరతంబు సంధించుచు"

3)

 "పరమరహాస్యంబునుంబోలు మఱి రహాస్యంబు లేదు" "ఆ చరమార్థం బనియెడు తెప్పగట్టి."

ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని సూచించే పదాలూ, పద బంధాలూ వచనాల్లో చాలా కనబడతాయి. పరమరహస్యం. పరమనాంచారి. పెరుమాళ్ళు, తిరుమణి, తిరుచూర్ణములు, తళిగె తిరుకళ్యాణం, ఆడియేని. దాసిన్ తోండండు. ప్రపత్తి, ప్రపన్నులు అచార్య శేషము. ఎంబేరు మానార్ణు, తిరు పట్టణము. తిరుమాళీగ, తిరువడిగళ్ళు, తిరుముఖారవిందము