పుట:Sinhagiri-Vachanamulu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

కృష్ణమాచార్యుల సంకీర్తన గురువు

వరాహపురాణాంతర్గత కైశికీమాహాత్మ్య కథానాయకుడైన గాయక చండాలునిపట్ల కృతాజ్ఞతా సూచకంగా, సంకీర్తనంలో అతని వారసత్వాన్ని పొందినతాను అతని వారిపట్ల ఆ మాత్రం ఆర్తిని కనబరచక పోవటం అకృ తజ్ఞం అన్న ఉపకారస్మృతితో కృష్ణమాచార్యులు హరిజనులపట్ల వ్యవహంచే రనిపిస్తోంది. ఇట్లాంటి విప్లావక సన్ని వేశాలు జీవితంలో ఉండటంవల్లా, తమిళంలోనో సంస్కృతంలోనో (మాత్రమే) స్తుతించాల్సిన స్వామిని దేశిసంప్రదాయంలో తెలుగులో ఆయన స్తుతించటంవర్ణా' అగ్రవర్ణాలవారికీ , ద్రావిడాభిజాత్యసంపన్నులై ఆంధ్ర దేశంలో మత ప్రచారం కోసం పీఠాలు నెలకొల్పుకొన్న బ్రాహ్మణ శ్రీవైష్ణవ కుటూంబాలవారికీ ఆయనా ఆయన వాజ్మయమూ అంటే అనాదరభావం కలిగి ఉండవచ్చు, అంచేతనే ఇతరు లతోపాటు శ్రీవైష్ణవ సాంప్రదాయికుల్లోనూ సింహగిరి వచనాలు కనబడ కుండా పోయేయి.

సింహగిరి వచనాలు- వింగడింపు

ప్రస్తుతం ముద్రిత వచనాలను విషయవైవిధ్యాన్ని బట్టి 5, 6 రకాలుగా వింగడింపవచ్చును. ఈ వింగడింపు ఎట్లా ఉన్నా ఆన్నిటా అంతర్వాహినిగా వైష్ణవపారమ్యం, మహత్వం ప్రవహిస్తూనే ఉంటుంది.

1. నామసంకీర్తన వచనాలు. వచనం అంతా సంబుద్ధులతో నిండి ఉంటుంది. ఈ సంబుద్ధులన్నీ విష్ణు నామగుణ విభవ ప్రతిపాదకాలుగా విలసిల్లటం విశేషం. పైవాటిలోనే మరో అంతర్విభాగం ఉంది. ఈ సందోధనలు రామపరంగానో కృష్ణపరంగానో ఒక క్రమపద్ధతిలో కూర్చబడి తత్తజీవిత ప్రతిపాదకాలుగా ప్రస్ఫురిస్తాయి. ఇట్లా శ్రీరామాయణం. భాగవత విష్ణు పురాణాలూ ఈ వచనాల్లో కీర్తింపదిడ్డాయి. ఈయన శ్రీరామాయణ వచనం లాంటిదే తరువాతివారైన శ్రీ మన్నిగమాంత దేశికుల శ్రీ రఘువీరగద్య, సంబుద్ధ్యాత్మకంగా శ్రీ రామాయణ ప్రతిపాదకం యిది.