పుట:Sinhagiri-Vachanamulu.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

అలనాడు నీవుమైలన్న చొక్కయనంటుకొన్న సుద్ది చెప్పుదునా
గొల్లెతల వాడ చీకటిని తప్పుకోరి చేసినది చెప్పుదునా
.. .. .... .. ..
.. .. .. ..
యీడు వెట్టుకొని నీపు బోయదాని యెంగిలిధిన్నది చెప్పుదుగా"

పై పంక్తుల్లో భావ మేకాకుండా "ఎంగిలి దిన్న ది చెప్పుదునా" అన్న ఆచార్యుల వారి వృత్త గంథి అన్నమయ్య గారి పదానికి మంజు మంజీరమే అయింది.

కృష్ణమాచార్యులు పై వచనంలోనే కోమటి పిల్లవా డెంతకూ లేవక పోవటంతో కోపంవచ్చి స్వామిని

“నీకు చాతుర్లక్ష గ్రంథ సంకీర్త సం కాయను మాతల్లి కడవాడవా? నీవు మాకెన్నాళ్ళ ఋణస్థుడవో నీకు నేనెన్నాళ్ళ ఋణస్థుడనో"అంటారు. ఈ భావంతో పాటు

"మా తల్లి కడవాడవా" అనేది ఒక అభాణకమే అయి అన్న మయ్యగారిలో ఎల్లా ప్రవేశించిందో చూడండి-

" నేము ని కన్యులమా నీవుమాలో లేవా
యీ మేర లనే మమ్ములనేలు కొందుగాక౹౹
ధర విభీషణుండు మీ తల్లి కడవాడా
నిరతి ఘంటకర్ణుండు మీ తండ్రి కడవాడా
యిర వైధృవుండు మీయిల్లాలి కడవాడా
శరణన్న మాటలో సరిగగాచితిరి ".

అని ఆచార్యుల వారికంటె మఱి నాలుగాకు లెక్కువే చదివేరు అన్నమయ్యగారు. ఇట్లాగే ఆచార్యులవారి “విదురు నింట విందు" అన్నమయ్య గారింటా విందు లారగించేడు.

అన్నమయ్యగారి కుమారుడు పెద తిరుమలాచార్యులు తండ్రిగార్ని అనుసరించి సంకీర్తనలు వ్రాయటమేకాక కృష్ణమాచార్యుల అడుగుజాడల్లో వచనాలు విన్న వించేడు. రచనా పద్ధతిలోనూ భావవ్యక్తి కిరణంలోనూఆచార్యులవారి ముద్ర యీ వచనాల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది. తామ్ర