పుట:Sinhagiri-Vachanamulu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41

అగ్రవర్ణత్వ-శ్రీవైష్ణవాల మీద కృష్ణమాచార్యులు ప్రకటించిన యీ భావాలు అన్నమాచార్యుల పదాల్లో ఎల్లా ప్రతిబింబిస్తున్నాయో క్రింది పదాలు చిత్తగిస్తే తెలుస్తుంది.

" ఆణు రేణు పరిపూర్ణుడైన శ్రీవల్లభుని
ప్రణు తించు వారువో బ్రాహ్మలు"
హరినామములనే సంధ్యాది విధులొనరించు
పరిపూర్ణ మతులుచో బ్రాహ్మలు;
హరి మంత్రవేద పారాయణులు హరిభక్తి,
పరులైన వారు వో బ్రాహ్మలు;
ఏవి చూచినను హరియన్నిటంగలడనుచు
భావించు వారువో బ్రాహ్మలు;

“కొంచెమును ఘనముంగనుగొననేల హరించలంచు
పంచమహా మహాపాత కుండె బ్రాహ్మణోత్త ముండు౹౹
వేదములు చదివియును విముఖుండై హరికథల
నాదరించని సోమయాజి కంటే
ఏదియును లేనికుల హీనుండై నను విష్ణు
పాద సేవకుడువో బ్రాహ్మణోత్త ముండు11.

కోడి పుంజుల యుద్ధాన్న భివర్ణించే వచనంలో కృష్ణమాచార్యులు స్వామిని కికురిస్తూ “ఈ కోమటి పిల్లవాణ్ణి బతికిస్తావా లేకపోతే నీగుట్టంతా బయట పెట్టేదా” అని బెదిరిస్తారు. ఆ సందర్భంలో

“దేవా మీరు శబరియెంగిలి ఉన్నది చెప్పుదునా
ఆతని ప్రాణవాయుపు నిచ్చెదవా"

అంటారు.

కృష్ణమాచార్యుల ఈ భావ వల్లి అన్నమయ్య గారి హృదయోద్యాసంలో నాటుకొని చిగిరించి తీగలుసాగి ఏడు కొండలపొడిపై పూలజల్లులు కురిసింది-

" హరినా కులంచ మిచ్చేవు అన్ని మర్మములు చెప్పుదునా
దోరవంటు మొక్క నీ దాసులతోడ తుచ్ఛపునీచేత చెప్పుదునా!!

(6)