పుట:Sinhagiri-Vachanamulu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39

నాన్నీ దేవా! అన్న సంభోధనతో ప్రారంభిస్తారు. మహత్వ ప్రతిపాదనమో, నామ సంకీర్తనమో, పూర్వభాగవత కథాకథనమో వచన వస్తువుగా ఉంటుంది. చివఱకు నమస్కారమకుటంతో ముగుస్తుంది. ఇదీ ఆయన వచనాల సామాన్య లక్షణం. పోతన్న గారి యీ వచనాల్లోనూ ఈ లక్షణాలు -దేవా అన్న సంబుద్ధితో వచనం ప్రారంభం కావటం, అంతర్భాగం మహత్వ ప్రతిపాదకం కావటం, శరణాగతి నమస్కారాలతో వచనం ముగియటం -కనబడతాయి. ఇవి ప్రధాన గ్రంథాంతర్వర్తులు కనక మకుట సంప్రదాయం ఉండదు. వచనంలో నమస్కారం లేనప్పుడు అవ్యవహితంగా ఆ ఊపు లోనే పద్యం అందుకొని అందులోనైనా నమస్కారాదిగానో, నమస్కారాంతంగానో వచనభావం పరిసమాప్తి చెయ్యటం పోతన్న గారిలో కనబడుతుంది. ఈ ఉదాహరణల్ని పరిశీలించండి.

(1) " దేవా ఇట్టి జీవాత్మ స్వరూపుడవును సకలాత్మలకు నాత్మయైన పరమాత్మ స్వరూపుడవునని యెవ్వ రెఱుంగుదురు .. .అదిగావున.

'దేవా నీ చరణ ప్రసాద కణలబ్ధింగాక .... ...ఓ యీశ్వరా !” భాగవతం దశమస్కంధం పూర్వ భాగం. 570.

(2) దేవా సకల పురుషాంతర్యామి రూపత్వంబువలన పరమపురుషుం....వయ్యును ఒప్పు నీకు నమస్కరించెదను." భా. ద, పూ. 682.

(3) "దేవా నీ చేత నింకఁ జాబూర ముష్టిక గజ కంస శంఖ యవన ముర నరక ..... అర్జున సారథి వై యనే కాక్షోహిణీ బలంబుల వధియించెదవు, మఱియును.

'కృష్ణా : నీ వొనరించు కార్యములు లెక్కింపన్ ..... విశ్వేశ్వరున్ మ్రొక్కెదన్". భా.ద పూ. 1183.