పుట:Sinhagiri-Vachanamulu.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37

అనే పేరుతో సమగ్రంగా ఉన్న వచన గ్రంథం ఒకటి ఉన్నట్లు క్యాటలాగు వల్ల తెలుస్తోంది. వచన సంఖ్య తెలియదు. కృష్ణమాచార్య వచనలక్షణాలు ఇందులో ఉన్నాయి. దేవా అని ప్రారంభ సంబోధన' నమోనమో శ్రీవేంకటేశ్వరా నమస్తే నమస్తే నమః' అని తుదివాక్యం. శ్రీ వేంకటేశ్వరా ! అన్నది మకుటం కావచ్చును.

క్యాటలాగులో ఉదాహృతమైన వచనం :-

మొదలు. “దేవా : మీ దివ్యతేజస్సు సూర్యుండెఱుంగు. మీ భుజబలంబు కోదండం

        బెఱుంగు. మీ మహిమ విశ్వామిత్రుండెఱుంగు. మీ వదనంబు వశిష్ట వాల్మీకాడు 
        లెఱుంగుదురు."

తుది. “నీ భక్తులై నవారికి అటు మీదట మీరున్న వైకుంఠంబు గలుగజేతురు. గాన

        ఇందుకు సందేహంబులేదు. శ్రీహరి సింహగిరి నరహరి నమోనమో శ్రీ 
        వెంకటేశ్వరా నమస్తే నమస్తే నమః"

ఆ ఎత్తు గడలోని దేవాతోపాటు ఈ ముగింపులోని “సింహగిరి" ముద్రని యిక్కడ గమనించాలి. ఇందులోని శైలీభావాలు రెండూ కృష్ణమాచార్యుల్నే గోచరింపచేస్తున్నాయి. కొన్ని సింహగిరి వచనాలనే తరవాతి వెంకటేశ్వర భక్తు లెవరో తమ ఇష్టదైవం పేరు చేర్చి వేంకటేశ్వర మహత్వంగా ప్రచారం చేసి ఉంటారనే అనుమానానికి పై వచనం అవకారం ఇస్తోంది. పుస్తకం అంతా పరిశోధిస్తే కాని వాస్తవం నిక్కచ్చిగా చెప్పలేం. కాని యీ అనుమానంతో పరిశోధన చెయ్యటం మాత్రం అవసరం. ఇదే నిజమైతే మఱికొన్ని కృష్ణమాచార్య వచనాలు వెలుగులోకి వస్తాయి. ఈ అనుమానం ప్రామాణిక మే కావచ్చుననటానికి మరో ఆధారం కూడా కనబడుతోంది.

తంజావూరి సరస్వతీ మహల్ పుస్తక భాండాగారంలో “వేంకటేశ విన్నపములు" అనే పేర అజ్ఞాత కర్తృకంగా ఒక వచన గ్రంథం ఉన్నట్లు క్యాటలాగు సూచిస్తోంది. ఇందులో కొన్ని వచనాలు తాళ్ళపాక పెదతిరుమలాచార్యులవిగా తిరుపతివారి ప్రచురణల్లో ఉన్నాయి, కోన్ని కృష్ణమా