పుట:Sinhagiri-Vachanamulu.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29

అవకాశం ఉందా అంటే అదీ కుదరటం లేదు. పొతకమూరి భాగవతుల ప్రసంగంలో అప్పటికీ చాతుర్ల క్షలకు లక్షౌఏభై వేలు కొఱత అంటున్నారాయన దీన్ని బట్టియిది వాచకమే అనటంలో అనుమానం అక్కరలేదు. కృష్ణమాచార్యులనాడు గంటంతో తాటాకుల మీద వ్రాసుకొనే అలవాటుంది. ఒకానొక సందర్భంలో ఆయన స్వామి సన్నిధిని గానం చేస్తూండగా స్వామి బాల రూపంతో వచ్చి ఆయన తొడమీద కూర్చొని గంటంతో తాటాకుమీద ప్రాయసాగేడట:. దీన్ని పట్టి అంతకుముందు వ్రాయకుండా ఆశువుగా ఎప్పటికప్పుడు తోచినట్టుగానం చేసే అలవాటున్నా ఈ సంఘటన తరవాత నైనా వ్రాయించాలన్న ఊహ ఆయనకు తోచి ఉండాలి. అంతదాకా అక్కర్లేదు 'చాతుర్లక్ష' అనగానే, సంఖ్యాపరిమితి పెట్టుకోగానే వ్రాయించే ఉంటారనేది నిర్వివాదం. అయితే యీవ్రాయించటం తామ్ర పత్రాలమీదేనా? తాళపత్రాల మీద కూడా వ్రాయించి ప్రచారానికి వీలు కల్పించేరా? అన్నదో ప్రశ్న. కొన్ని తాళ పత్ర గ్రంధాల్లో ఫలశ్రుతిగా సంకీర్తన మహత్వం చేపుతూ “ఎవరు వ్రాసినా" అని ఉన్నందువల్ల ఆయన కాలంలోనే యివి ప్రోత్సహింపబడి దేశంలో వ్యాపించి ఉంటాయి. అయితే ఏ ఒక్కరూ చాతుర్లక్షనూ వ్రాసే అవకాశం ఉండక పోవచ్చు. చాతుర్ల క్షలూ ఉన్న తాళ పత్రప్రతి ఉండే అవకాశం కాని అది మనకు లభించే అవకాశం కాని లేక పోవచ్చు అక్కడికి మిగిలిన ఆశ అల్లా తామ్రపత్రికల నిక్షేపం మీదే.

తామ్రపత్రికలు

రాగిరేకులు చేయించి వాటి పై కీర్తనలు చెక్కించి వాట్ని కృష్ణమాచార్యులు శ్రీ. న తీసుకుపోయినట్లు ప్రతాపచరిత్ర చెప్తోంది. కృష్ణమాచార్యులవారు తమ చాతుర్లక్ష సంకీర్తనల్ని తామ్రపత్రికల మీద చెక్కించి హరి సమర్పణంగా స్వామి భండారానకు సమర్పించి భావితరాలవారి కోసం స్వామిప్రసాదంగా, భాగవత శేషంగా వాట్ని నిక్షేపించినట్టు దీనివల్ల తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రతాపచరిత్రను జాగ్రత్తగా పరిశీలించాలి ఈ విషయం ఇంతకు పూర్వమే విన్నవించేను. ప్రతాప చరిత్రతో పాటు