పుట:Sinhagiri-Vachanamulu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25

మద్రాసు భాండాగారంలోంచి సంపాదించేరో తెలియదు. తంజావూరినుంచి వ్రాయించి తెప్పించుకొన్న “విష్ణునామ సంకీర్తనఫలం"లో వచనం ఉదాహరించకుండా అవిజ్ఞాతజన్మ కారణ రహస్యమైన యీ వచనాన్ని ఉదాహరించటంలో వారి ఊహ ఏమిటో ! ఒక వేళ ఈవచనాన్నే శ్రీ కోదండరామయ్యగారో, శ్రీ ఆనందమూర్తి గారో భారతుల్లో వెనక ఉదాహరించేరేమో స్మృతికి రావటం లేదు. శ్రీ ఆరుద్రగారి వ్రాతలవల్ల, వారిచ్చిన ఉదాహరణ వచనంవల్లా శ్రీ కోదండరామయ్య గారు మద్రాసు 'సింహగిరినరహరి వచనాల'ను సేకరించే ఉండిఉంటారని నేనూ మొదట్లో భావించేను. శ్రీ కోదండరామయ్య గారు మద్రాసు ప్రతు లెరగనివారుకాదు. కాని తమవద్దే ఆ వచనాలుంటే రెండు దశాబ్ధాలుగా వాట్ని 'వెలుగులోకి తేకుండా ఊరుకొంటారా శ్రీ కోదండ రామయ్యగారు అని మళ్ళీ సందేహమూ కలుగుతోంది, మద్రాసు ప్రతి అక్కడ లేకుండా, తిరుపతి చేరకుండా, చివరకు సింహగిరి వచనాల ప్రతి ఎక్కడా లేకుండా పోయిన యీ గడ్డుకాలంలో, 1952లోనో అంతకు పూర్వమో మద్రాసు మాతృకకు ప్రతి వ్రాసుకొని ఉంటే శ్రీ కోదండరామయ్యగారే కృష్ణమాచార్య వాజ్మయ పోషణకు తోడ్పడాలి. 1[1]వారు తాము సేకరించిన ముద్రిత ప్రతి భిన్నాలైన వచనాల్ని యథాతథంగా నైగా పత్రికాముఖంగా ప్రకటిస్తే 'పరివర్ధిత సింహగిరి వచనాల' ముద్రణకు అవకాశం ఉంటుంది. కృష్ణమాచార్యులను గురించి ఏమేనా మరికొంత చెప్పే అవకాశమూ ఉంటుంది. 2[2]

'సింహగిరి నరహరి వచనాలు' అన్న పేరుతోనే ఉన్న పుస్తకం కనపడక పోవడం, నాటినుంచీ ప్రథమాంధ్ర వచన కావ్యరచయితకు తెలుగు దేశంలో జరుగుతున్న అమర్యాదకు తార్కాణ. ఇందుకు బాధ్యులైనవార్ని

  1. 1 మాన్యులు శ్రీ కోదండ రామయ్యగారు పరమ పదించక ముందు వ్రాసినది యీ పీఠిక.
  2. 2 శ్రీ ఆరుద్రగారిచ్చిన వచనం తిరుపతిలో ఉన్న R 1034 'కృష్ణమాచార్య సంకీర్తనము' అన్న ప్రతిలో ఉన్నది. 1978లో తిరుపతి నుంచి యీ ప్రతిని నేను వ్రాయించి తెప్పించుకొన్నాను.