పుట:Sinhagiri-Vachanamulu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23

కృష్ణమాచార్య సంకీర్తనము

కాగితపు ప్రతి. సమగ్రం. వరుస నెం. 655 ఆర్. నె. 206. 1911-15 సంవత్సరాల్లో గ్రంథాలయం వాతప్రతి నుంచి ఉద్ధరింపబడింది. 1917లో ముద్రింపబడ్డ మద్రాసు ప్రా. లి. పు. భాండాగారంవారి ట్రయన్నియర్ క్యాటలాగు రెండవసంపుటం మూడవభాగం (తెలుగు) లో ఈ వివరాలున్నాయి. ఉదాహృతవచనాన్ని పట్టి పైన పేర్కొన్న గ్రంధంయిదీ ఒక్కటిగానే కనపడుతున్నాయి.

కృష్ణమాచార్య సంకీర్తనము

తాళపత్ర ప్రతి. సమగ్రం, వరుస నెం. 654 బీరువా వివరాలు 11_1_5. ఈ వివరాలు 1932 లో ప్రకటితమైన "తెలుగు" లిఖిత గ్రంథాల ఆకారాది సూచిక" 31 వ పుటలో ఇవ్వబడ్డాయి. డిస్క్రిప్టివ్ క్యాటలాగుల్లో మరి దీని వివరాలు కనబడలేదు.

కృష్ణమాచార్య సంకీర్తనము

తాళపత్రప్రతి, సమగ్రం, ఆర్ 4476 (25) ఆర్ 206 వంటిదే అని యిక్కడ వివరణ వ్రాసి వుంది. కృష్ణమాచార్య ప్రశంసాపరమైన పుస్తకం ఇది అని క్యాటలాగు వారూ, విమర్శకులూ భావిస్తున్నారు. కాని కృష్ణమాచార్య వాజ్మయ లక్షణాలు ఇందులో చాలా ఉన్నాయి. ఉదాహృత భాగంలో ముద్రలేదు. దేవా అన్న సంబోధన, కృష్ణమాచార్యుల పేరు ఉన్నాయి. అంతంలో "ఈ దివ్యనామ స్మరణం యెవరు వ్రాసినా యెవరు చదివినా యవరు విన్నా” అని ఉంది. దీన్ని బట్టి యిది కృష్ణమాచార్య సంకీర్తనమే కావచ్చును. ఆయన మహత్వాన్ని ఓరుగంటితో ఆయన సంబంధాన్ని సూచించే వచనం ఒకటి ముద్రిత ప్రతిలోనూ ఉంది. కృష్ణమాచార్యుల మహత్త్వాన్ని ఇతరులే చెప్పక్కర్లేదు ఆయనే చెప్పుకోగల రనటానికి ఆయన వచనాలే సాక్ష్యం. కృష్ణమాచార్యులు ప్రధమ పురుషలో