పుట:Sinhagiri-Vachanamulu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

టున్నాయి. ఇది కళింగాంతర్భాగం. కళింగ గాంగులు సింహాచలానికి ఎంతో సేవచేసేరు. ఒరియా ప్రజకూ. వారి రాజులకు లాగే సింహాద్రి నరసింహుడు ఇష్టదైవం. ఇప్పటికీ సింహాచలం భోగరాగాలూ ఆదాయమూ ఒరిస్సా ప్రజలవే. కృష్ణమాచార్యుల గురువు, రక్షకుడు అయిన కృష్ణకువ్వారు నరసింహస్వామి భక్తుడయిన ఒక సన్యాసికావచ్చును. ఒరిస్సా ప్రాంతం నుంచి సింహాచలం రాకపోకలు చేసే వాడుకోవచ్చును. లేదా సంతూరులోనే అతనొక మఠంలో ఉండేవాడూ కావచ్చును. ఈ కువ్వారు కులశేఖరరావుగారూ హించినట్లే కుమారభవంకాచ్చును పదమధ్యమకారం ఆనునాసిక్యంతో వకారంగా పరిణమించటం అసంభవం కాదు. మామ మాఁవ అయింది. ఇల్లాగా కుమరాం కుఁవరాం (విశాఖ జిల్లాలోనిదే ఒక గ్రామం) అయింది. ఈ ఆనుసాసిక్యోచ్చారణ కళింగాంధ్రంలోనే అతిశయంగా కనబడుతుంది. తెలుగులో అర్ధబిందూచ్చారణం ఇక్కడే స్పష్టతరంగా వినబడుతుంది. అంచేత కృష్ణకుమార్ ని మనవారు కుమార్ కుఁవార్ కుంవార్ కుంవ్వారు అని ఉచ్చరించ వచ్చును. లేదా కృష్ణమాచార్యులాయనను కృష్ణకుమార్ అనే వ్యవహా రించితే పరంపరలో అది విపరిణామాన్ని పొంది ఉండనూవచ్చును. మొత్తానికీ కృష్ణకుమార స్వామి తెలుగు వారనితోచదు. తరవాత, బలమైన సాక్ష్యం ఆయన ఒరియా దేశస్థులటానికే తోడ్పడుతుంది. ఇది కూడా సంతూరుకు తెలంగాణా సంబంధం కంటె కళింగాంధ్ర సంబంధాన్నే దృఢతరం చేస్తోంది. ఈ కృష్ణకుమార్ పేరునే కృతజ్ఞతా సూచకంగా కృష్ణమాచార్యులకు అతని తల్లి దండ్రులు పెట్టిఉంటారేమో:

సింహగిరి వచనాలు - ప్రక్రియా ప్రాథమ్యం<

ఆంధ్రభాషలో కావ్యరచనకు శ్రీకారంచుట్టిన నన్నయగారు చంపూప్రాయంగా భారతాన్ని సంతరించేరు. సంస్కృతంలో అనూచానంగా వస్తున్న కేవలపద్యకావ్య పద్ధతికంటే సమకాలీనంగా భోజరాజవలంభించిన చంపూ పద్ధతే ఇంపుగా కనపడ్డట్టుంటాయనకు. తిక్కనగారు చివరకు నన్నయగారి మార్గాన్నే అనుసరించినా మొదట్లో నిర్వచన పక్కిననుసరించి తెలుగులో