పుట:Sinhagiri-Vachanamulu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

సరి పెట్టుకోలేని సంగతి. ఈ మధ్యలో ఎన్నో క్షేత్రాలూ, మఠాలూ, అనాధ మందిరాలూ ఉండగా ఎక్కడా ఆ బాలుణ్ణి దించకుండా ఆ సన్యాసి ఇంత దూరం ఎలా, ఎందుకు తెచ్చినట్టు ? ఆయన సింహాచల స్థిరనివాసి అయిన కుటుంబీకుడుగాడు సన్యాసి శిరోమణి ఆయె: - ఆ తరవాత ఆంధబాలుడు చూపుగలవాడై సంకీర్తనం చేస్తూండగా అతని తల్లి దండ్రులు, బంధువర్గం వారూ సింహాచలం వచ్చి చాలా సంతోషించి బాలుడికి జాతకర్మాది బ్రాహ్మణ సంస్కారాలన్నీ చేస్తారు. ఈ సంతూరు ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే కృష్ణమాచార్యులవార్త వారికి తెలియటం వారంతా సింహాచలం రావటం ఇవన్నీ ఆరోజుల్లో జరగటం కొంచెం అసహాజాలూ కష్టసాధ్యాలూను. కనుక కృష్ణమాచార్యుల జన్మస్థలం అయిన 'సంతూరు' విశాఖపట్నం జిల్లాలోనే సింహాచలం పరిసరాల్లోనే ఉండి ఉండాలి. అలాగైతేనే ఆయన సింహాచలం చేరటానికి కాని తరవాత బంధువర్గం వారు ఆయనజాడ తెలుసుకొని అక్కడికి రావటానికి కాని వీలుంటుంది.

-సింహాద్రి- అప్పన్న దే-

ఈ సింహాద్రి లేక సింహాచలం విశాఖ పక్కదే. ఇతర ప్రమాణలతో పాటు ఆంతరంగిక సాక్ష్యమే ప్రబల తమ ప్రమాణం ఇక్కడ సింహగిరి నరహరిని సింహాద్రిఅప్ప - అప్పడు అని కృష్ణమాచార్యులు చాలా చోట్ల వ్యవహరిస్తారు. శ్రీ జగన్నాధంతోపాటు సింహాచలాన్ని పేర్కొంటారు. ఈ సహపఠితత్వంవల్లాయిది విశాఖ సింహాచలమే. ఇందులో అనుమానం అక్కరలేదు. అంచేత సంతూరు సింహాచలానికి వీలయినంత దగ్గరలో ఉండటమే సంభావ్యతరం. సింహాచలానికి రమారమి 25 మైళ్ళ దూరంలో 'సంతలూరు' అనే ఊరుంది ఇది 'సంతూరు' కావచ్చునేమో పరిశోధించాలి.

-కువ్వారు- కమారశబ్దభవం-

ఇక్కడ నాదొక కొత్త ప్రతిపాదన. తెలంగాణా జిల్లాలతో కంటె మొదటి నుంచి 'ఒరిస్సా' దేశంతో సింహాచలానికి సన్నిహిత సంబంధాలు - -