పుట:Sinhagiri-Vachanamulu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

కాని కృష్ణమాచార్యులు నిర్మించిన ఊరు ఇదేనా అని ? ఆయన నిర్మించే రంటున్నారు అంటే కొత్తగా ఒక గ్రామం ఇలువేల్పు పేరనో, గురువు పేరనో తన పుణ్య-ప్రతిష్ఠల కోసమో నిర్మించుకొని ఉండాలి అంతే కాని గురుస్మృతీ, దైవస్మృతీ ఏదీ లేకుండా వట్టి 'కల్లూరు' అనే పేరు తన గ్రామానికి పెట్టుకొంటారా అనేది పరిశీలించవలసిన అంశం. ఇంతే కాదు కృష్ణమాచార్యులకు దివ్యమైన పేర్లంటే మోజుకూడాను. తన మేనమామ గారి నివాసం " శ్వేత ద్వీపం" అంటారాయన. ఈ 'శ్వేతద్వీపం' ఏ అంతర్వేదిక్షేత్రఘు కావచ్చునేమో ! పరిశోధకులు నిరూపించాలి. ఇట్లాంటి అలవాటున్న వ్యక్తి తను నిర్మించిన గ్రామానికి మరీపాషాణప్రాయమో అవద్యమద్యార్థకమో అయిన కల్లూరన్న పేరు పెడతారనుకోను.ఇక ఆయన జన్మదేశ నిర్ణయం చేసేటప్పుడు సింహాచలం తో ఆయనకున్న సంబంధాన్ని విస్మరించకూడడు. ఈ సంబంధం నిరూపించటానికి కాని, జన్మదేశాన్ని నిరూపించటానికి కాని, ప్రయత్నించేముండు ఈ వృత్తాంతం కల ఆయన వచనం చూడకపోతే అంత కంటే మహాపచారం ఉండదు. ఆయన వచనం ప్రకారం.

అంధుడని తల్లిదండ్రులు నూతిలో పారవేసిన కుఱ్ఱవాణ్ణి 'కృష్ణకువ్వారు' అనే ఒక సన్యాసి తీసి పెంచి కొన్ని సంవత్సరాలకు తాను సింహాద్రి వెళుతూ ఈ బాలుణ్ణి కూడా తోడుకొనిపోయి కింద ఈ పిల్లవాణ్ణి దిగవిడిచి తాను మాత్రం స్వామి సన్నిధికి ( కొండ పైకి) వేళ్ళేటప్పుడు తనను మరిచిపోయి స్వామి సన్నిధినే "కువ్వారు" ఉండి పోతాడేమో అనే భయంతో ఆ పిల్లవాడు తనను మరువ వద్దంటాడు. అందుకనుగుణంగానే మూన్నాళ్ళు ఈ బాలుడి సంగతి పట్టుంచుకోడు ఆ "కువ్వారు". తరవాత సింహాద్రినాధుడు బాల రూపంలో వచ్చి పాలు ఇవ్వటం. అంధ బాలుడికి దృష్టి రావటం జరుగుతుంది. ఇదీ ఆయన జన్మకధ.

- సంతూరు - సంతపురి కాదు-

ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాలో 'సంతపురి' లో ఉన్న అంధ శిశువుని తీసుకొని ఒక సన్యాసి కళింగాంధ్రంలోని సింహాచలానికి చేరటం