పుట:Sinhagiri-Vachanamulu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

నాట ఆవతరించేయనటం అతిశయోక్తి కాదు అవినయమూకాదు. అందుకే కృష్ణమాచార్యుల వ్యక్తిత్వం తదవతార పూర్వరంగం అర్థం కావటంకోసమే సుదీర్ఘమయిన ఇంత ఉపోద్ఘాతం ఉపక్రమించక తప్పలేదు.

తెలుగు కవి అంటే చాలు అతని దేశకాలాల విషయంలో పెద్దగా లిదుమారంచెల రేగుతుంది. కృష్ణమాచార్యులకూ ఈ “గాలి" సోకక తప్పలేదు.

కృష్ణమాచార్యుల్ని గురించి కృషి చేసినవారు

కృష్ణ మాచార్యులను గూర్చి ఆధునికుల్లో బహుళః మొట్ట మొదట ప్రస్తావించిన ఘనత శ్రీనిడుదవోలు వెంకటరావు గారిది. తరువాత శ్రీ తిమ్మావర్షుల కోనందరామయ్యగారూ, శ్రీవేటూరి ఆనందమూర్తి గారు పరిచయ వ్యాసాలు వ్రాసినట్లున్నారు. ఆ తరువాత శ్రీ ఆరుద్రగారు తమ సమగ్ర ఆంధ్రసాహిత్య చరిత్ర పద్మనాయక యుగం-సంపుటంలో కృష్ణమాచార్యుల్ని గురించి క్లుప్తంగా ముచ్చటించేరు. చివరగా ఆగ్రరచయితల సంఘంపక్షాన డా౹౹ కుల శేఖరరావుగారు “సింహగిరి వచనములు" అనే పేర కృష్ణమాచార్యుల వచనాన్ని కొన్నిటిని సేకరించి ప్రకటించి తెనుగు జాతికృతజ్ఞతకు పాత్రులైనారు. 1964లో అనుకొంటాను నేనూ పూజ్యులు డా౹౹ కొర్లపాటి శ్రీరామమూర్తి గారూ కలిపి ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఉన్న కృష్ణమాచార్య వచనాలను సంస్కరించి ప్రకటించాలన్న ఊహకు వచ్చేం. కడమవచనాల కోసం, కాలదేశాల కోసం కొంత ప్రయత్నించీ, వ్యక్తి గతాలైన ఇబ్బందుల వల్ల మా ఊహ ఊహగానే ఉండిపోయింది. ఇంతలో 1968 లో డా॥ కులశేఖరరావుగారి 'సింహగిరి వచనములు' వెలుగులోకి వచ్చేయి ఈ ఉద్యమంతో సంబంధం గలవాడుగా, విశేషించివ్యక్తిగతంగా డా౹౹ కుల శేఖరరావు గారికి కృతజ్ఞతాభివందనాల ర్పిస్తున్నాను. డా౹౹ రావు గారు గ్రంథారంభంలో ఉపోద్ఘాతం సంతరించి కృష్ణమాచార్యుల జీవితవిశేషాలు కొన్ని తెలియ చేసేరు

ప్రధమాంధ్ర వననకావ్యనిర్మాత కృష్ణమాచార్యుల్ని గురించి వీలైనన్ని యధార్థాలూ, ఔచితీసహాలూ అయిన విషయాలు సవిమర్శంగా ఆంధ్ర ప్రజానీకం ముందుంచి వారికి కృష్ణమాచార్యుల్ని గురించి “తొలి తెలుగు వచనకవి"ని గురించి తెలియ జెప్పటమే నేనాశించిన ప్రయోజనం.