పుట:Sinhagiri-Vachanamulu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

పోవచ్చు. అంచేతే ఆయస సమాంతరాలుగా కాకుడా పన్ని యోగ విశిష్టాలుగా, సన్నిహితాలుగా ఉభయ వేదాంతశాఖల్నీ ప్రచారంలో ఏర్పరిచేరు. ఫలితంగా ద్రావిడ వేదాంతశాఖాధ్యాయి అబ్రాహ్మణుడు సంస్కృత వేద విజ్ఞాన వంచికుడుకాడు. అట్లాగే ద్రావిడ వేదాధ్యయనం చేసిన సంస్కృత “వేదాంతి- బ్రాహ్మణుడు" కేవల మేధావిగా మడిగట్టుక కూచోక హృదయ స్పందనంతో, వైష్ణవసాధారణీకరణంతో, ఇతర వర్ణాలపట్ల హార్ధమైన సౌబ్రా త్రంతో సమన్వయ దృష్టిలో సంచరిస్తాడు. ఈస్నానిహిత్యనైరంతర్యం వల్ల ఇరు తెగలకూ “విశిష్టాద్వైతం" సిద్ధించడం విశేషం. ఇంతగడుసుదనపు ఎత్తుగడతో ఆయన ఉభయ వేదాంత ప్రతిష్టాపనాచార్యులై వారు అటు దివ్య ప్రబంధానుసంధానం ప్రచారంచేసి ఆళ్వారుల భక్తి మాధురీ మధుస్రవంతులలో సహృదయ సామాన్య ప్రజల్ని తలమున్కలు చేసి తమవైపు ఆకట్టు కొన్నారు. ఇటు మహా మేధావుల్నీ, కర్మిష్తుల్నీ, అగ్రవర్ణాలవార్నీ, కర్కశతర్క వాదాలతో కటకటపడుతున్న వార్నీ. తమ శ్రీష్య సిద్ధాంత ప్రతిపాదనంతో తమవేపు తిప్పుకొన్నారు. ఒక వర్గం వారు రాగవతుల వారసులు. ఇంకో వర్గంవారు "కేవల వై దికులకు వారసులు. అటీ భాగవత యముననీ అటా వైదిక గంగనీ సరస్వతీ స్వరూపులాయన తనతో మేళనంచేసి తన దివ్వ తేజస్సు అంతర్వాహినిగా ఈ సంస్కృతి అంతా భిన్న భిన్న రూపాలుగా కాక త్రివేణీ(సమాహార) రూపంగానే భారతం అంతా ప్రవహించి పునీతం చెయ్యాలని సంకల్పించారు. ఇది అమలులోకి వచ్చి ప్రచారం సాగితే భిన్న వర్గాల వారు ఏకోన్ము ఖంగా ప్రయాణంచేసి సమభావం సౌభ్రాత్రం కలిగి శ్రీవైష్ణవ సాధారణీకరణంతో ఏకజాతిగా రూపొంది భారతావనిని స్వర్గసీమ చేస్తారని భావించేరాయన, ఈ దృష్టితోనే ఆయన ఉభయ వేదాంత శాఖల్ని ఏర్పాటు చేసి తత్ప్రచారానికి “పీఠాలను" నెలకొల్పి “పరంపర "లనేర్పాటుచేసి సుస్థిరమూ సుదృఢమూ అయిన వ్యవస్థనూ ప్రణాళికను రూపొందించి లోకోపకారకులయేరు.

ప్రాంతీయ భాషల్ని మత ప్రచారంలో ఆదరించటం తమిళ భాషామయమైన దివ్యప్రబంధాన్ని 'వేదం'గా పరిగణించటం, దాక్షిణాత్య సంప్రదాయ సిద్ధాలైన శ్రీవైష్ణవాలయాలలో అందరకూ తీర్ధ ప్రసాద స్వీకారయోగ్యతను పరికల్పించటం,