పుట:Sinhagiri-Vachanamulu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

వర్ణవ్యవస్థ - సమతావాదం

వర్ణవ్యవస్థ దొంతరల్లో ఆదుగున పడి అణగి పోతున్న వార్ని, మేధతో జ్ఞానంతో ప్రమేయం లేకుండా కేవలం సవాసనులైన వార్ని ఆర్తి, సౌందర్యదృష్టి అతిశయంగా కలవార్ని, ఆకర్షించి వార్ని ఏకముఖం చేసేందుకు ఆయన ఆళ్వారులు పాడిన “దివ్యప్రబంధ" వాజ్మయాన్ని చేపట్టేరు. దివ్యప్రబంధాను సంధానంతో వారిలో సాధారణీకరణాన్ని సాధింపదలచుకొన్నారాయన. ఆరోజుల్లో సంపూర్ణంగా వర్ణవ్యవస్థ మీద తిరుగుబాటు చేసి వైదిక చిహ్నాలైన యజ్ఞోపవీతాదుల్ని పరిత్యజించిన వీరశైవులు సైతం వైదికమతాను యాయుల్ని పరాజితుల్ని చేసేందుకు బ్రహ్మసూత్రాల నాశ్రయించి స్వమతానుగుణంగా వాటికి భాష్యం సంతరించుకొన్నారు. అయితే ఇందుకు విలక్షణంగా శ్రీమద్రామానుజులు వైదిక మార్గవర్తను లైన అగ్రవర్ణాలవార్ని సవ్యమార్గంలో నడిపిచేందుకు వాస్తవాన్నే శ్రుత్యంతరంగాన్నే సుందరంగా విశదపరిచేందుకు బ్రహ్మసూత్రాలకు తామూ శ్రీభాష్యం సమకూర్చేరు. వేదప్రామాణ్యాన్ని అంగీకరిస్తూనే వర్ణ వ్యవస్థను పాటిస్తూనే పరస్పర సౌద్రాత్రంతో సమానత్వం సాధించ వచ్చుననే సమన్వయ వాది ఆయన. వర్ణవ్యవస్థను పాటించటమంటే హెచ్చుతగ్గులు ప్రదర్శించుకుంటూ, పరస్పరం దెబ్బలు తీసుకుఁ టూ లేదా బక్కవాళ్ళను, చిక్కినవాళ్ళను చావుదెబ్బలు తీస్తూ, చివరకు తామే అయిన సమాజాన్ని కుళ్ళబెట్టుకొనే కుత్సిత విధానాలనవలంబించటం కాదు. తత్త ద్వర్ణాల వారు అన్యోన్యా విరోధంగా దేశకాలోచిత ధర్మ నిర్వహణం చేసుకొంటూ శ్రీవైష్ణవ సాధారణీకరణంతో మానవజ్వోపాధికమైన ఏకజాతిగా రూపొందాలనే ఆయనకాంక్ష

శ్రీమద్రామానుజులు- సమన్వయవాది

వేద విజ్ఞానాన్ని, దానికి వారసులైన వార్ని వదిలేసి అవై దికులేమో అని కొందరానాడు భావిస్తున్న కేవల భాగవతులో కలిసి పోవటం ఆయన ఆభిష్టంకాదు. అట్లా అని భాగవత సంప్రదాయాన్ని దూరంచేసుకోవటమూ ఆయనకు ఇష్టం లేదు. రెండు వర్గాల వార్ని ఏకముఖంగా నడిపించటమే ఆయనలక్ష్యం ఈ కలయికని సాంప్రదాయికులు అక్ష్యరాలా సమ్మతించక