Jump to content

పుట:Shrungara-Savithri-1928.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాలించెను. ఆకాలమున వందలకొలఁదిగా నిత్యాన్న దాన ధర్మ సత్రములు వెలసెను. వందలకొలఁదిగా నసాధారణ శిల్పసౌందర్యముగల దేవాలయమంటపగోపుర ప్రాకారాదులు వెలసెను. ప్రతిగ్రామమునకును గావేటి కాల్వలు పాఱింపఁబడెను. ఈతిబాధలకు, క్షామమునకు, ప్రజాక్షోభమునకు నా దేశమున నిలువ నీడ లేకుండఁ జేయఁబడెను. సరస సంగీత చాతుర్యములు, నవన వాలినయనై పుణ్యములు, ప్రశస్తశిల్ప చిత్రమాస్తులను నిర్మాణములు, మధురతర సంస్కృతాంధ్ర కవితా కల్పనములు, విద్వద్గోష్ఠులు, సకలశాస్త్రచర్చలు, కనకాభిషేకములు, గ్రామ గజాందోళి కాచ్ఛత్ర సోమరారి బహుమానములు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, ఋతూత్సవాయనోత్సవ వత్సరోత్సవాది దేవోత్సవములు, వివిధయజ్ఞ విప్రోత్తము విహారములు, షోడళ మహాదానములు, భగణాగత రాజరక్షణములు నాఁటి ముచ్చటలు. మెఱపుఁరీగలఁ బోలు వెలుఁతలు, సంస్కృతాంధ్ర భాషలందు సరసకవితలు నేర్చినవారు, సంగీత మందు బిరుదం నెలందినవారు నాఁడు వేలకొలఁగానుండిరి, స్వక్రతువులు సల్పినశ్రోతులు వేలకొలదిగానుండిరి. సత్కావ్యకర్తల్లు, శాస్త్రక ర్తలు, వేలకొలదిగానుండిరి. వీరెవ్వరును రఘునాధరాజును రాజమాతునిఁగాఁ దలఁపకయిరి. తండ్రిని గాను గురునిఁగాను వేల్పును గాను ప్రాణము ప్రాణమునుగాను.