పుట:Shriiranga-mahattvamu.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

    కులములు ఫలములు కూర్ములు పగలును
    చుక్క పొత్తువులు నచ్చుగ నెఱింగి
    పిదప మహాభూత బీజచింతనమును
    వర్ణ వర్గగ్రహనిర్ణయంబు
    నక్షత్రవేధయు నరిమిత్రశోధన
    క్రమముఁ దత్ఫలవిచారమును దెలిసి

తే. తమకు నెదురులేక తప్పించి ధారుణీ
    విభులసభల బుధులు వివిధగతులఁ
    జెలఁగి పొగడఁ గవిత చెప్పెడువారు స
    త్కవుల గాక యితరకవులు కవులె? 5


3–5 సంఖ్యలు కవితరంగిణిలోని పద్యసంఖ్యలు, పై పద్యములందు 31 సంఖ్యగల పద్యము. ఈ 5 సంఖ్యగల పద్యము కొద్ది భేదముగా-సమానములే, చాగంటివారి కీ పద్యము లెచట లభించెనో? తెలుపలేదు.