మకరకుంభములకు మార్తాండసూనుఁడు
పతి త్రివేదమూర్తి భాస్కరుండు
కర్త సింహమునకుఁ గర్కటరాశికి
నఖిలలోకవంద్యుఁ డమృతకరుఁడు. 76
వ. అని యివ్విధంబున, 77
మ. గణవర్ణాదుల మేలుఁ గీడు వెలయంగాఁ జెప్పె సాహిత్యల
క్షణదీక్షాగురుఁడైన గౌరనసుధీసత్పుత్రుఁ డత్యుల్లస
ద్గుణరత్నాభరణుండు [1]భైరవకవీంద్రుం డెందుఁ దద్జ్ఞుల్ దనుం
బ్రణుతింపం గవిరాడ్గజాంకుశము భూప్రఖ్యాతమై మించఁగన్. 78
{ఇంతవరకు పరిషత్ వారు పైన పేర్కొనిన పత్రికలో ముద్రించిరి, మధ్య మధ్య పద్యములలోని అసమగ్ర భాగాలు (... ఈ గుర్తులు) పత్రిక యందే గలవు, మరియు 78 పద్యానికి ఫుట్ నోట్సు కూడా - వారుంచినదే)
కవి గజాంకుశమున లేనివని రెండు పద్యములను చాగంటి శేషయ్యగారు
ఆంధ్ర కవితరంగిణియందు (1980 ముద్రణ 5 భాగము 244 పుటలో) ప్రకటించిరి - ఆ పద్యము లివి,
క. పతి మృతుఁ డగుఁ బద్యాదిని
మృతనక్షత్రంబు లిడిన మేదురసౌఖ్యా
న్వితుఁ డగు నమృతము వలన న
ప్రతిమములగు తారకములఁ బద్యాది నిడన్.
సీ. అవనిగణాలి గణావలి కధిదేవ
తలును వన్నెలు గ్రహంబులును వాని
- ↑ రత్నపరీక్షను, శ్రీరంగమాహాత్మ్యమును రచించినకవి, ప్రతికి మూలము మానవల్లి రామకృష్ణకవిగా రిచ్చినది. (పత్రిక. 121 పుట)