పుట:Shriiranga-mahattvamu.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

    నేరోగము గైకొన దా
    చేరువచుట్టంబు గణముఁ జేర్చినఁ జాలున్. 42

క. రవిగణమును గగనగణము
    కొని మొదలిడి పద్య మొసఁగఁ గఱచిన నేలౌ
    భువిజెదరములు (?) గతమును
    శివశివ నరులిట్టి తపము సేయరు మొదలన్. 43

క. రాజులకు జగణరగణము
    లోజం గదియించి సుకవి యొసఁగిన పద్యం
    బాజుల జయ మీఁజాలదె
    తేజులు నేనుఁగులు భటులుఁ దేరులు నేలా. 44

చ. ఉడుపతి యేగ్రహంబు పది నున్నను దానును వానివన్నెయై
    నడచి శుభాశుభంబుల నొనర్చును లోపల నేగణంబుసం
    గడి భగణంబు నిల్చు నధికంబగు నాఫల మిచ్చు నవ్విథుం
    డొడయఁడు గాన దానికది యుక్తమె యెన్న వృథోక్తు లేటికిన్. 45

గీ. శుక్రశశులు తెలుపు... వర్ణులు
    తరణికుజులు బుధుఁడు సురగురుండు
    పసిఁడివన్నెవారు భానుజరాహులు
    సజలజలధరంబుచాయవారు. 46

ఉ. వారిజమిత్రసూనుఁడును వారిజమిత్రుఁడు భూమిపుత్రుఁడుం
    గ్రూరులు వారిఁ జేరునెడఁ గ్రూరుఁడు చంద్రతనూభవుండు బృం
    దారకరాజమంత్రియును దైత్యగురుండును సౌమ్య లవ్విధుం
    డారయఁ గృష్ణపక్షతిథులందు శుభప్రదుఁ డెన్ని చూచినన్. 47

గీ. శ్వేతచంద్రుఁడైన సేమంబు చేకూరు
    రక్తచంద్రుఁడైన రణము చేయుఁ